బిగ్ బాస్-13 మాజీ కంటెస్టెంట్, నటి హిమాంశు ఖురానా తనకు కరోనా వైరస్ పాజిటివ్ అని ప్రకటించింది. ఇటీవలి కాలంలో తనతో కాంటాక్ట్ లో ఉన్నవారు కరోనా టెస్టులు చేయించుకోవాలని కోరింది. రైతు బిల్లులకు నిరసనగా ఈ నెల 25 న ముంబైలో జరిగిన ప్రదర్శనల్లో ఈమె పాల్గొంది. అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ తనకు పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందని హిమాంశు ఖురానా పేర్కొంది. అయితే ఆరోగ్యంగా ఉన్నానని, త్వరలో ఈ వైరస్ బారి నుంచి బయటపెడతానని ఆమె తెలిపింది.
బిగ్ బాస్-13 షో ఫైనలిస్టుల్లో ఒకరైన ఆసిమ్ రియాజ్ తో హిమాంశు పలు మ్యూజిక్ వీడియోలు చేసింది.