AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏసీబీ కస్టడీకి మాజీ తహశీల్దార్‌ నాగరాజు

కీసర మాజీ తహశీల్దార్‌ నాగరాజు అవినీతి చిట్టా అంతా ఇంతా కాదు..ఇప్పటికే కీలక ఆస్తులు స్వాధీనం చేసుకున్న ఏసీబీ.. కేసులో విచారణను వేగవంతం చేసింది. కోర్టు ఆదేశాలతో ఈ కేసుతో సంబంధమున్న నలుగురు నిందితులను నేటి నుంచి కస్టడీకి తీసుకుని విచారించనున్నారు.

ఏసీబీ కస్టడీకి మాజీ తహశీల్దార్‌ నాగరాజు
Balaraju Goud
|

Updated on: Aug 25, 2020 | 9:42 AM

Share

కీసర మాజీ తహశీల్దార్‌ నాగరాజు అవినీతి చిట్టా అంతా ఇంతా కాదు..ఇప్పటికే కీలక ఆస్తులు స్వాధీనం చేసుకున్న ఏసీబీ.. కేసులో విచారణను వేగవంతం చేసింది. కోర్టు ఆదేశాలతో ఈ కేసుతో సంబంధమున్న నలుగురు నిందితులను నేటి నుంచి కస్టడీకి తీసుకుని విచారించనున్నారు. ఈ విచారణలో అవినీతి వెనకాల ఉన్న పెద్ద చేపలతోపాటు..మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశముందంటున్నారు.

కీసర మండల మాజీ తహసీల్దార్‌ నాగరాజు, శ్రీనాథ్‌, అంజిరెడ్డి, సాయిరాజ్‌ను మూడు రోజుల పాటు కస్టడీకి అనుమతిచ్చింది కోర్టు. దీంతో చంచలగూడ జైల్లో ఉన్న నలుగురు నిందితులను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకొని.. నాంపల్లిలోని కార్యాలయంలో విచారించనున్నారు. ఈ కేసులో పట్టుబడిన కోటి పది లక్షలపై అధికారులు కూపీ లాగనున్నారు. అదే విధంగా నాగరాజు సమక్షంలో బ్యాంక్‌ లాకర్‌ను తెరవనున్నారు.

మూడు రోజుల కస్టడీలో భాగంగా ఇప్పటి వరకు ఉన్న అనుమానాలు, ఈ కేసులో సేకరించిన సాక్షాలను నిందితుల ముందు ఉంచి విచారిస్తారు. ఇంట్లో దొరికిన డబ్బు ఎవరిది?  కోటి పది లక్షల డబ్బు  ఎక్కడి నుంచి సమకూర్చారు?  భూ వివాదంలో కుదిరిన ఢీల్ ప్రకారం మిగిలిన 90 లక్షలు ఎక్కడ ఉంచారు? అనే పలు అంశాలపై ఆరా తీయనున్నారు.

నాగరాజు పై అధికారులను మ్యానేజ్ చేసేవాడనే అరోపణలు కూడా ఉన్నాయి. దయారా ఇన్సిడెంట్ కంటే ముందు ఇంకొన్ని విలువైన భూ వివాదాలను పరిష్కరించారనే ఆరోపణలు చేస్తున్నారు భాదితులు. కేసులో ఇప్పటి వరకు నిందితులు ఇచ్చిన స్టేట్‌మెంట్, విచారణలో ఏసీబీ గుర్తించిన అంశాలన్నింటిపై మూడు రోజుల కస్టడీలో వివరాలను తీసుకొనున్నారు అధికారులు.

ఇదిలావుంటే, కీసర తహశీల్దార్‌ కార్యాలయంలో 10 రోజుల్లో నలుగురు తహశీల్దార్‌లు మారారు.. ఈనెల 17 గీతను నియమించగా ఆమె విధులకు హాజరు కాలేదు. అదేరోజు సాయంత్రం గౌతం కుమార్‌ను నియమించారు. తాజాగా పలువురు తహశీల్దార్లను బదీలీ ఉత్వర్వులు జారీ చేశారు కలెక్టర్‌. దీంట్లో భాగంగా కుత్బుల్లాపూర్‌లో పనిచేస్తున్న గౌరీవత్సలను కీసర తహశీల్దార్‌గా నియమించారు.

Follow Us
వంకాయ చికెన్ కర్రీ ఇలా వండితే.. గిన్నె కూడా వదలరు
వంకాయ చికెన్ కర్రీ ఇలా వండితే.. గిన్నె కూడా వదలరు
'ది బ్లఫ్' ప్రమోషన్లలో మెరిసిన దేశీ గర్ల్.. ఒక్కో వస్తువు లక్షలే
'ది బ్లఫ్' ప్రమోషన్లలో మెరిసిన దేశీ గర్ల్.. ఒక్కో వస్తువు లక్షలే
బాలీవుడ్ కపుల్స్ లగ్జరీ అబోడ్స్.. కోట్ల విలువైన తారల కలల సౌధాలు
బాలీవుడ్ కపుల్స్ లగ్జరీ అబోడ్స్.. కోట్ల విలువైన తారల కలల సౌధాలు
కోడిగుడ్డు ఎండుచేపల పులుసు ఇలా వండితే.. రోజూ కావాలంటారు
కోడిగుడ్డు ఎండుచేపల పులుసు ఇలా వండితే.. రోజూ కావాలంటారు
హ్యారీ బ్రూక్ వీరవిహారం.. పాకిస్థాన్‌పై ఇంగ్లండ్ ఘనవిజయం!
హ్యారీ బ్రూక్ వీరవిహారం.. పాకిస్థాన్‌పై ఇంగ్లండ్ ఘనవిజయం!
మష్రూమ్ ఆమ్లెట్ ఇలా వేసి తింటే ఎవరైనా ఆహా అనాల్సిందే..
మష్రూమ్ ఆమ్లెట్ ఇలా వేసి తింటే ఎవరైనా ఆహా అనాల్సిందే..
రాగి పిండితో అదిరే బ్రేక్ ఫాస్ట్! తక్కువ నూనె, ఎక్కువ ప్రోటీన్
రాగి పిండితో అదిరే బ్రేక్ ఫాస్ట్! తక్కువ నూనె, ఎక్కువ ప్రోటీన్
లాంగ్ డ్రైవ్ చేసే వాళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
లాంగ్ డ్రైవ్ చేసే వాళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
రాష్ట్ర ప్రభుత్వానికి రూ.583 కోట్లు చెల్లించిన బ్యాంక్‌! ఎందుకంటే
రాష్ట్ర ప్రభుత్వానికి రూ.583 కోట్లు చెల్లించిన బ్యాంక్‌! ఎందుకంటే
సూర్యరశ్మి కాదు.. ఈ ఆహారాలతోనూ విటమిన్-D! ‘సన్‌షైన్’ డైట్ ప్లాన్
సూర్యరశ్మి కాదు.. ఈ ఆహారాలతోనూ విటమిన్-D! ‘సన్‌షైన్’ డైట్ ప్లాన్