మితిమీరిన వేగం: దుర్గం చెరువు తీగల వంతెన పై డివైడర్ ను ఢీకొట్టిన బైక్.. ఒకరు మ‌ృతి.. ఇద్దరికి గాయాలు

|

Dec 18, 2020 | 7:56 AM

హైదరాబాద్ మాదాపూర్ లోని దుర్గం చెరువు తీగల వంతెన పైన జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు ప్రాణాలుకోల్పోయాడు...

మితిమీరిన వేగం:  దుర్గం చెరువు తీగల వంతెన పై డివైడర్ ను ఢీకొట్టిన బైక్.. ఒకరు మ‌ృతి.. ఇద్దరికి గాయాలు
Follow us on

హైదరాబాద్ మాదాపూర్ లోని దుర్గం చెరువు తీగల వంతెన పైన జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు ప్రాణాలుకోల్పోయాడు. మద్యం మత్తులో ఉండి బైక్ పై రాష్ డ్రైవింగ్ చేస్తూ డివైడరను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. తెల్లవారుజామున 3:45 నిమిషాల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మృతుడు శివ కాగా, అతనితో తోపాటు, బైక్ మీద ఉన్న మిగతా ఇద్దరు ప్రశాంత్, విజయ్ కి గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుడు శివ సూరారం లోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో B Tech 3 వ సంవత్సరం చదువుతున్నట్టు సమాచారం.