రాజస్థాన్లో కొత్తగా 51 కరోనా కేసులు.. మొత్తం 751..
కోవిద్ 19 కరాళ నృత్యం చేస్తోంది. ఈ వైరస్ ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా 200 దేశాలకు పైగా పాకింది. భారత్ లో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 8,356కి చేరింది.
కోవిద్ 19 కరాళ నృత్యం చేస్తోంది. ఈ వైరస్ ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా 200 దేశాలకు పైగా పాకింది. భారత్ లో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 8,356కి చేరింది. అందులో 273 మంది మరణించారు. ఇక రాజస్థాన్లో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ఆదివారం ఒక్కరోజే కొత్తగా 51 కరోనా కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర అడిషనల్ చీఫ్ సెక్రటరీ రోహిత్ కుమార్ తెలిపారు.
లాక్ డైన్ నేపథ్యంలో.. ఈ రోజు మొత్తం 8 జిల్లాల నుంచి 51 కేసులు వచ్చాయన్నారు. దీంతో రాజస్థాన్లో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 751కి పెరిగిందని చెప్పారు. ఆదివారం జైపుర్, బాన్స్వారా జిల్లాల నుంచి 15 చొప్పున.. జోధ్పూర్, బికనీర్ జిల్లాల నుంచి 8 కేసుల చొప్పున నమోదైనట్లు వెల్లడించారు. మరోవైపు జైపుర్లో ఇప్పటివరకూ అత్యధికంగా 316 కేసులు నమోదయ్యాయని తెలిపారు
Read Also: ఆ రాష్ట్రంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు.. లాక్డౌన్ నుంచి మినహాయింపు..