ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు ఎక్స్ గ్రేషియో విడుదల

తెలంగాణలో బలవన్మరణాలకు పాల్పడ్డ 243 మంది రైతుల కుటుంబాలకు నష్టపరిహారంగా రూ.14.58 కోట్ల ఎక్స్ గ్రేషియాను విడుదల చేసింది. తెలంగాణ వ్యాప్తంగా 24 జిల్లాల్లో మొత్తం 243 మంది రైతులు ఆత్మహత్యలకు చేసుకున్నారు. పంట నష్టాల కారణంగా వీరంతా బలవన్మరణాలకు పాల్పడ్డారు. వీరి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.6 లక్షల చొప్పున ప్రభుత్వం నష్టపరిహారం అందించే సంకల్పంతో ఈ నిధులను విడుదల చేసింది. మృతిచెందిన రైతుల వివరాలను జాగ్రత్తగా పరిశీలించి వీరి లిస్టును తయారుచేశారు. మొత్తం 243 మంది […]

ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు ఎక్స్ గ్రేషియో విడుదల

Updated on: Aug 02, 2019 | 10:58 AM

తెలంగాణలో బలవన్మరణాలకు పాల్పడ్డ 243 మంది రైతుల కుటుంబాలకు నష్టపరిహారంగా రూ.14.58 కోట్ల ఎక్స్ గ్రేషియాను విడుదల చేసింది. తెలంగాణ వ్యాప్తంగా 24 జిల్లాల్లో మొత్తం 243 మంది రైతులు ఆత్మహత్యలకు చేసుకున్నారు. పంట నష్టాల కారణంగా వీరంతా బలవన్మరణాలకు పాల్పడ్డారు. వీరి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.6 లక్షల చొప్పున ప్రభుత్వం నష్టపరిహారం అందించే సంకల్పంతో ఈ నిధులను విడుదల చేసింది.

మృతిచెందిన రైతుల వివరాలను జాగ్రత్తగా పరిశీలించి వీరి లిస్టును తయారుచేశారు. మొత్తం 243 మంది రైతు కుటుంబాలకు ఈ ఆర్థికసాయాన్ని అందించనున్నారు. రాష్ట్రంలోగల 24 జిల్లాల్లోకెల్లా నల్గొండ జిల్లాలోనే అత్యధికంగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ఎక్స్‌గ్రేషియో నిధులను ఆయా జిల్లాల కలెక్టర్లకు బదిలీ చేస్తూ గురువారం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Loading...
Unable to load recommendations.
Follow Us