పాకిస్థాన్లోని ఖైబర్ ఫక్తూన్ ఖవా ప్రాంతంలో విషాదం నెలకొంది. కోహిస్థాన్ జిల్లా కుండియా తహసీల్ పరిధిలోని బాగ్రా ప్రాంతంలో వేగంగా వస్తున్న బస్సు ప్రమాదవశాత్తు మురికికాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 24 మంది మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు మృతుల వివరాలు సేకరిస్తున్నారు. బస్సు వేగంగా రావడం వల్ల మురుగుకాల్వలో పడిందని పోలీసులు తెలిపారు.