దివ్యాంగురాలైన మైనర్ బాలికపై వార్డెన్ లైంగిక దాడి

|

Jun 06, 2020 | 10:06 PM

మహారాష్ట్రలో దారుణం జరిగింది. దివ్యాంగురాలైన మైనర్ బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు దుర్మార్గుడు. బాలిక గర్భం దాల్చడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

దివ్యాంగురాలైన మైనర్ బాలికపై వార్డెన్ లైంగిక దాడి
Follow us on

మహారాష్ట్రలో దారుణం జరిగింది. దివ్యాంగురాలైన మైనర్ బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు దుర్మార్గుడు. బాలిక గర్భం దాల్చడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన 14 ఏళ్ల బాలిక కాటోల్‌లోని హాస్టల్లో ఐదేళ్లుగా ఉంటోంది. హాస్టల్ వార్డెన్ రాజేంద్ర కాల్బందే(44) బాలికపై కన్నేసిన మాయమాటలతో ఆమెను లొంగదీసుకున్నాడు. హాస్టల్ గదిలోనే దివ్యాంగురాలని చూడకుండా లైంగిక దాడికి పాల్పడేవాడు. ఇలా ఒక్కసారి కాదు మార్చి నెల నుంచి పలుమార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె గర్భం దాల్చింది. ఈ విషయం తెలిసిన ఆమె తల్లి, ఓ నర్సు సాయంతో ఇంట్లోనే రహస్యంగా బాలికకు అబార్షన్ చేయించింది. స్థానికుల సహాయంతో సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాటోల్‌లోని హాస్టల్ వార్డెన్ రాజేంద్ర కాల్బందేను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అటు బాలకకు చికిత్స చేసిన సింధు దేహాంకర్ అనే నర్సును, బాలిక తల్లిని కూడా అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.