రేవంత్ రెడ్డి బ్రదర్స్ కబ్జా బాగోతం..!
గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గోపనపల్లిలోని విలువైన భూముల్లో అక్రమ లావాదేవీలపై తెలంగాణ సర్కార్ కొరడా ఝులిపించింది. గోపనపల్లి భూ అవకతవకలపై ప్రభుత్వం సీరియస్ అయింది. రెవెన్యూ రికార్డులు తారుమారు చేసి భూ లావాదేవీల్లో అక్రమాలకు సహకరించారనే ఆరోపణలతో శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్ గా పని చేసిన శ్రీనివాస్రెడ్డిని సస్పెండ్ చేసింది.
గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గోపనపల్లిలోని విలువైన భూముల్లో అక్రమ లావాదేవీలపై తెలంగాణ సర్కార్ కొరడా ఝులిపించింది. గోపనపల్లి భూ అవకతవకలపై ప్రభుత్వం సీరియస్ అయింది. రెవెన్యూ రికార్డులు తారుమారు చేసి భూ లావాదేవీల్లో అక్రమాలకు సహకరించారనే ఆరోపణలతో శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్ గా పని చేసిన శ్రీనివాస్రెడ్డిని సస్పెండ్ చేసింది. సస్పెన్షన్ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయని తెలిపింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు సస్పెన్షన్ కొనసాగుతుంది. ఈ ఆదేశాలు అమల్లో ఉన్నంత వరకూ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లొద్దని శ్రీనివాసరెడ్డిని ప్రభుత్వం ఆదేశించింది
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆయన సోదరుడు కొండల్ రెడ్డి ఈ భూముల్లో ఆరు ఎకరాలకు పైగా కొనుగోలు చేశారనే అరోపణలు వస్తున్నాయి. రెవెన్యూ రికార్డుల్లో పేర్లను ఇష్టానుసారంగా మార్చి కేవలం మ్యుటేషన్ ఆధారంగానే భూముల లావాదేవీలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. భూముల మ్యుటేషన్పై సమగ్ర విచారణ జరపాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమేయ్ కుమార్ ఆదేశించారు. గతంలోనే రేవంత్ రెడ్డి బ్రదర్స్పై భూ కజ్జాకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో మొత్తం 16 మంది సాక్షులను విచారించారు. విచారణలో భాగంగా గోపనపల్లి భూముల లావాదేవీలపై రేవంత్ రెడ్డి, కొండల్ రెడ్డి, లక్ష్మయ్యలపై సెక్షన్ 447, 427, 506 లతో పాటు రెడ్విత్ 34, ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి. దీనిపై కోర్టులో 28 పేజీల చార్జ్షీట్ దాఖలు చేశారు పోలీసులు.