Jagan AmithShah Meet: అమిత్షాతో జగన్ భేటీ.. ఇదే మెయిన్ టాపిక్
Key point in Jagan and Amithshah meet: రెండు తెలుగు రాష్ట్రాలలో అత్యంత ఆసక్తి కలిగిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్, కేంద్ర హోం మంత్రి అమిత్షా భేటీలో అసలు పాయింట్ ఏంటో తెలిసిపోయింది. ప్రధానిని కలిసిన రెండో రోజునే జగన్ కేంద్ర ప్రభుత్వంలో నెంబర్ టూ గా భావిస్తున్న అమిత్షాతో భేటీ కానుండడంతో రాజకీయ వర్గాల్లో ఉత్సుకత నెలకొంది. గతంలో జగన్ ఢిల్లీ వెళితే.. కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేకపోయిన అమిత్షా ఇపుడు తానంతట తానే అపాయింట్మెంట్ […]

Key point in Jagan and Amithshah meet: రెండు తెలుగు రాష్ట్రాలలో అత్యంత ఆసక్తి కలిగిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్, కేంద్ర హోం మంత్రి అమిత్షా భేటీలో అసలు పాయింట్ ఏంటో తెలిసిపోయింది. ప్రధానిని కలిసిన రెండో రోజునే జగన్ కేంద్ర ప్రభుత్వంలో నెంబర్ టూ గా భావిస్తున్న అమిత్షాతో భేటీ కానుండడంతో రాజకీయ వర్గాల్లో ఉత్సుకత నెలకొంది. గతంలో జగన్ ఢిల్లీ వెళితే.. కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేకపోయిన అమిత్షా ఇపుడు తానంతట తానే అపాయింట్మెంట్ ఖరారు చేసి మరీ జగన్ను ఢిల్లీకి పిలవడం వెనుక కారణాలపై రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి.
నిజానికి జగన్ ప్రధానమంత్రితో భేటీ అయిన వెంటనే వైసీపీ.. కేంద్రంలోని ఎన్డీయే సర్కార్లో చేరి రెండు మంత్రి పదవులు పొందబోతోందని ప్రచారం మొదలైంది. ఈ ప్రచారం బీజేపీ శిబిరం నుంచి మొదలైనా.. వైసీపీ వర్గాలు గట్టిగా ఖండించలేకపోతున్నాయి. కేంద్రంలో చేరేది లేదని ఒకరిద్దరు వైసీపీ నేతలు అంటున్నా.. గట్టిగా చెప్పలేకపోవడంతో దాల్ మే కుచ్ కాలా హై అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో జగన్, అమిత్షా భేటీలో అసలు పాయింట్ వెలుగులోకి వచ్చేసింది. కేంద్రంలోని ఎన్డీయేలో చేరాలని, ప్రభుత్వంలో భాగస్వామ్యం తీసుకోవాలని బీజేపీ నేతలు జగన్ను కోరింది నిజమేనంటున్నారు. అయితే.. ఈ రెండు పార్టీల కలయిక ఉభయతారకంగా వుండాలన్నది బీజేపీ కండీషన్ అంటున్నారు.
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలతో ఏపీ రాజకీయం హాట్హాట్గా మారింది. ప్రధానమంత్రి మోదీతో సీఎం జగన్ ఏం చర్చించారు? అనే విషయం మాత్రం ఇప్పటివరకూ బయటకు రాలేదు. ఏపీకి కావాల్సిన సాయంపై ఆయన పది అంశాలు ప్రస్తావించారని తెలిసింది. కేంద్రమంత్రివర్గంలో వైసీపీని చేరాలని మోదీ అహ్వానించారని ఓ ప్రచారం నడుస్తోంది. ఈవిషయంపై మాట్లాడేందుకు అమిత్షాను కలవాలని మోదీ సూచించారని టాక్. కానీ ఈవిషయంపై బీజేపీ నుంచి లీకులు వస్తే…వైసీపీ నుంచి మాత్రం ఎలాంటి సమాచారం రావడం లేదు. ఈ విషయంపై వారం పది రోజుల్లో క్లారిటీ వస్తోందని తెలుస్తోంది. అయితే మోదీతో జగన్ సమావేశంలో మరో అంశం చర్చకు వచ్చిందని తెలుస్తోంది. అదే రాజ్యసభ సీటు డిస్కషన్.
మార్చి నెలలో రాజ్యసభకు ఎన్నికలు జరగబోతున్నాయి. వైసీపీ ఖాతాలో నాలుగు సీట్లు పడబోతున్నాయి. ఇప్పటికే ఆ సీట్ల కోసం పోటీ నెలకొంది. అయితే రాజ్యసభలో బలం పెంచుకోవాలని బీజేపీ గత ఐదేళ్లుగా ప్రయత్నాలు చేస్తోంది. పలు రాష్ట్రాల నుంచి తమ సభ్యులను రాజ్యసభకు పంపుతోంది. ఇప్పుడు ఏపీ నుంచి కూడా ఒకరిని రాజ్యసభకు పంపాలని బీజేపీ ఆలోచిస్తోందట. వైసీపీకి దక్కే నాలుగు సీట్లలో ఒక సీటు తమకు ఇవ్వాలని మోదీ జగన్ను కోరారట.
Also read: Janasena worried of YCP, BJP friendship
సీటుపై అమిత్షాతో మీటింగ్లో కూడా జగన్ చర్చించే అవకాశం కన్పిస్తోంది. గతంలో కూడా టీడీపీ సర్కార్ ఉన్నప్పడు ఓ సీటును బీజేపీకి కేటాయిస్తూ వచ్చారు. అప్పట్లో నిర్మలా సీతారామన్, సురేష్ ప్రభు ఏపీ కోటాలో రాజ్యసభకు వెళ్లారు. ఇప్పుడు అదే ఆనవాయితీ ప్రకారం తమకు సీటు ఇవ్వాలని బీజేపీ పెద్దలు కోరారట. దీంతో జగన్ సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది. అమిత్షా మీటింగ్లో బీజేపీ తరపున రాజ్యసభకు ఎవరూ పంపుతారనే విషయం చర్చించే చాన్స్ ఉంది.
కేంద్రంతో మరో నాలుగేళ్లు క్లోజ్గా నడవాలి. ఏపీకి బీజేపీ సర్కార్తో చాలా పనులు ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో భాగంగా నడవాల్సి ఉందని…ఇప్పుడు రాజ్యసభ సీటు ఇవ్వకపోతే బీజేపీతో సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది. మూడు రాజధానులతో పాటు పలు కీలక బిల్లులు కేంద్రం ఆమోదించాల్సి ఉంది. ఇలాంటి టైమ్లో కేంద్రంతో గొడవ ఎందుకు? వారికి ఓ సీటు ఇస్తే సరిపోతుందని జగన్ ఆలోచిస్తున్నారట. ఇందులో భాగంగా బీజేపీకి రాజ్యసభ సీటు ఇచ్చేందుకు జగన్ అంగీకరించారని తెలుస్తోంది. మొత్తానికి ఆ ఒక్కటీ తమకు ఇవ్వాలని కమలం పెద్దలు అడగడం…జగన్ ఇవ్వడం జరిగిందని సమాచారం.