సుశాంత్ కేసుపై సీబీఐ దర్యాప్తు, కంగనా రనౌత్ డిమాండ్

సుశాంత్ సింగ్ కేసులో సీబీఐ దర్యాప్తును బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సమర్థించింది. జస్టిస్ ఫర్ సుశాంత్, సీబీఐ ఫర్ ఎస్ ఎస్ ఆర్ అని రాసి ఉన్న ప్లకార్డును పట్టుకుని..

సుశాంత్ కేసుపై  సీబీఐ దర్యాప్తు, కంగనా రనౌత్ డిమాండ్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 13, 2020 | 5:52 PM

సుశాంత్ సింగ్ కేసులో సీబీఐ దర్యాప్తును బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సమర్థించింది. జస్టిస్ ఫర్ సుశాంత్, సీబీఐ ఫర్ ఎస్ ఎస్ ఆర్ అని రాసి ఉన్న ప్లకార్డును పట్టుకుని ఓ వీడియోను ఆమె విడుదల చేసింది.  ఈ కేసులో వాస్తవమేమిటో తాము తెలుసుకోదలిచామని ఆమె పేర్కొంది. ఈ కేసు విషయంలో ముంబై పోలీసులు హడావిడిగా వ్యవహరించడాన్ని, శివసేన నేత సంజయ్ రౌత్ వ్యాఖ్యలను కూడా కంగనా ఖండించింది. నగర పోలీసులు చాలావరకు దర్యాప్తును ముగిస్తున్నట్టే అని రౌత్ వ్యాఖ్యానించడమేమిటని ఆమె ప్రశ్నించింది. అటు సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ పోస్ట్ చేసిన వీడియోను కూడా కంగనా తన వీడియోకు జత చేసింది.