ఇజ్రాయెల్ టూర్లో మన స్టైలిష్ సీఎంని చూశారా!
ఏపీ సీఎం జగన్ ఇజ్రాయెల్లో పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ సందర్భంగా అక్కడి హడేరాలోని H2ID ఉప్పునీటి శుద్ది చేసే ప్లాంట్ను సీఎం సందర్శించారు. జగన్తో పాటు టెల్ అవీవ్లోని డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఇండియన్ మిషన్ షెరింగ్ కూడా ఉన్నారు. ఉప్పు నీటిని తాగునీరుగా మార్చే మెకానిజం మరియు ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్థిక వ్యవస్థ, వ్యయంపై ప్రదర్శన ఇచ్చారు. ప్రాజెక్టుకు ఏర్పాటునకు పెట్టి ఖర్చు, కార్యాచరణ ఖర్చుల గురించి వివరించారు. ఉప్పు నీటి శుద్ది చేసే […]
ఏపీ సీఎం జగన్ ఇజ్రాయెల్లో పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ సందర్భంగా అక్కడి హడేరాలోని H2ID ఉప్పునీటి శుద్ది చేసే ప్లాంట్ను సీఎం సందర్శించారు. జగన్తో పాటు టెల్ అవీవ్లోని డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఇండియన్ మిషన్ షెరింగ్ కూడా ఉన్నారు. ఉప్పు నీటిని తాగునీరుగా మార్చే మెకానిజం మరియు ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్థిక వ్యవస్థ, వ్యయంపై ప్రదర్శన ఇచ్చారు. ప్రాజెక్టుకు ఏర్పాటునకు పెట్టి ఖర్చు, కార్యాచరణ ఖర్చుల గురించి వివరించారు. ఉప్పు నీటి శుద్ది చేసే విధానంలో పలు ప్రక్రియను గురించి ఇజ్రాయెల్ అధికారులు వివరించారు. అక్కడ శుద్ది చేసిన నీటిని ముఖ్యమంత్రి సహా అధికారులు రుచి చూశారు. ఇజ్రాయెల్ పర్యటనను ముగించుకున్న సీఎం సహా కుటుంబ సభ్యులు ఇవాళ రాత్రి తిరుగు పయనం కానున్నారు. రేపు ఉదయం 11 గంటలకు నేరుగా విజయవాడకు వస్తారని పార్టీ వర్గాల సమాచారం.