భారత ఆర్మీ సంచలన నిర్ణయం.. 89 యాప్లు బ్యాన్..
దేశంలో ప్రస్తుతం యాప్ల బ్యాన్ పర్వం నడుస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం టిక్ టాక్ యాప్తో సహా 59 చైనీస్ యాప్లను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. వాటిని ప్లే స్టోర్ నుంచి కూడా తొలగించింది కేంద్రం. భారత-చైనా సరిహద్దు గాల్వాన్ లోయలో చోటుచేసుకున్న..
దేశంలో ప్రస్తుతం యాప్ల బ్యాన్ పర్వం నడుస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం టిక్ టాక్ యాప్తో సహా 59 చైనీస్ యాప్లను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. వాటిని ప్లే స్టోర్ నుంచి కూడా తొలగించింది కేంద్రం. భారత-చైనా సరిహద్దు గాల్వాన్ లోయలో చోటుచేసుకున్న ఘర్షణలో డ్రాగన్ కంట్రీ కారణంగా మన జవాన్లు 20 మంది మరణించారు. ఈ విషయంలో సీరియస్ అయిన మోదీ సర్కార్.. చైనా యాప్లను నిషేధించింది. ఇప్పుడు ఇదే బాటలో ఇండియన్ ఆర్మీ కూడా నడిచింది.
ఫేస్ బుక్తో సహా మొత్తం 89 యాప్లపై నిషేధం విధించింది. నిషేధించిన 89 రకాల యాప్ల నుంచి ఆర్మీ బయటకు వచ్చేసింది. ఇందుకు సంబంధించి భారత ఆర్మీ 89 యాప్ల జాబితాను విడుదల చేసింది. ఆర్మీలో పని చేస్తున్న సైనికులు జులై 15వ తేదీలోగా నిషేధించిన యాప్ల అకౌంట్స్ను తొలగించాలని ఆదేశించింది ఇండియన్ ఆర్మీ. అలా చేయని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్మీ స్పష్టం చేసింది. ఆర్మీ సూచించిన యాప్స్ జాబితాలో చైనాకు చెందిన యాప్స్తో పాటు ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్ చాట్, డైలీ హంట్, షేర్ ఇట్, ట్రూకాల్, పబ్ జీ, టిండర్ వంటి యాప్స్ కూడా ఉండటం గమనార్హం.
Read More:
కరోనాకు చెక్ పెట్టేందుకు తక్కువ ధరకే మరో జనరిక్ మెడిసిన్..
తెలుగు రాష్ట్రాల్లో కరోనా విలయం.. పెరుగుతోన్న మృతుల సంఖ్య…