ఇండియా గురించి ఇమ్రాన్ పిచ్చి మాటలు..సూపర్ కౌంటర్ ఇచ్చిన మన దేశం
డేంజరస్ కరోనా వైరస్ నుంచి బయటపడేందుకు ప్రపంచ దేశాలన్నీ పోరాటం చేస్తుంటే.. పాకిస్తాన్ మాత్రం తన వక్ర పంథాను మార్చుకోవడం లేదు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇండియన్ గవర్నమెంట్ పై అసత్య ప్రచారాలకు పూనుకున్నారు. ఇండియాలో కోవిడ్ వ్యాప్తికి ఆ దేశంలోని ముస్లింలనే కారణంగా చూపుతూ.. తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ సత్యదూరపు మాటలు మాట్లాడారు. అలాగే భారత్ లో ముస్లింల పట్ల వ్యవహరించే తీరు కరెక్ట్ కాదంటూ చౌకబారు విమర్శలు చేశారు. ఇండియాలో కోవిడ్ వ్యాప్తికి […]
డేంజరస్ కరోనా వైరస్ నుంచి బయటపడేందుకు ప్రపంచ దేశాలన్నీ పోరాటం చేస్తుంటే.. పాకిస్తాన్ మాత్రం తన వక్ర పంథాను మార్చుకోవడం లేదు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇండియన్ గవర్నమెంట్ పై అసత్య ప్రచారాలకు పూనుకున్నారు. ఇండియాలో కోవిడ్ వ్యాప్తికి ఆ దేశంలోని ముస్లింలనే కారణంగా చూపుతూ.. తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ సత్యదూరపు మాటలు మాట్లాడారు. అలాగే భారత్ లో ముస్లింల పట్ల వ్యవహరించే తీరు కరెక్ట్ కాదంటూ చౌకబారు విమర్శలు చేశారు. ఇండియాలో కోవిడ్ వ్యాప్తికి ముస్లింలే కారణమంటూ ..కావాలనే ముస్లింలను టార్గెట్ చేసుకున్నారంటూ ఇమ్రాన్ వ్యాఖ్యానించారు. దీంతో పాక్ ప్రధాని వ్యాఖ్యలకు భారత ప్రభుత్వం ధీటైన ఆన్సర్ ఇచ్చింది.
పాకిస్తాన్లో కరోనా మహమ్మారిని అడ్డుకోలేక.. భారత ప్రభుత్వంపై ఇమ్రాన్ చౌకబారు విమర్మలు చేస్తున్నారంటూ ఫైరయ్యింది. పాక్లో కరోనా సోకినవారికి.. ట్రీట్మెంట్ చేసే పరిస్థితి లేదని.. వాటి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే ఇలా మాట్లాడుతున్నారని మండిపడింది. ప్రస్తుత సమయంలో ఇతర దేశాలపై సత్యదూరపు ఆరోపణలు చేసే బదులుగా… సొంత దేశ ప్రజలను ఆదుకోవాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ ఓ ప్రకటన రిలీజ్ చేసింది.