డబ్బు కావాలంటే సరిహద్దుల్లో చేసే దొంగచాటు పనులు ఆపండి..

కరోనా నిధులను సేకరించడంలో భాగంగా భారత్, పాకిస్తాన్ మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రతిపాదనను తీసుకొచ్చిన పాక్ మాజీ ఆటగాడు షోయాబ్ అక్తర్ వ్యాఖ్యలపై 1983 ప్రపంచకప్ హీరో, భారత మాజీ సారధి కపిల్ దేవ్ మరోసారి కౌంటర్ ఇచ్చాడు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో క్రికెట్ గురించి ఒక్కటే మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. ఆట కంటే ఎక్కువగా ప్రాధాన్యతను ఇచ్చేవి చాలా ఉన్నాయని.. కరోనా కారణంగా పిల్లల భవిష్యత్తు నాశనం అవుతోందని.. అందుకే ముందుగా […]

డబ్బు కావాలంటే సరిహద్దుల్లో చేసే దొంగచాటు పనులు ఆపండి..
Follow us

|

Updated on: Apr 27, 2020 | 12:41 PM

కరోనా నిధులను సేకరించడంలో భాగంగా భారత్, పాకిస్తాన్ మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రతిపాదనను తీసుకొచ్చిన పాక్ మాజీ ఆటగాడు షోయాబ్ అక్తర్ వ్యాఖ్యలపై 1983 ప్రపంచకప్ హీరో, భారత మాజీ సారధి కపిల్ దేవ్ మరోసారి కౌంటర్ ఇచ్చాడు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో క్రికెట్ గురించి ఒక్కటే మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. ఆట కంటే ఎక్కువగా ప్రాధాన్యతను ఇచ్చేవి చాలా ఉన్నాయని.. కరోనా కారణంగా పిల్లల భవిష్యత్తు నాశనం అవుతోందని.. అందుకే ముందుగా విద్యాసంస్థలు, స్కూళ్లు తెరుచుకోవాలనుకుంటున్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు.

మరోవైపు క్రికెట్ మ్యాచులు నిర్వహించడం ద్వారా కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కునేందుకు విరాళాలు సేకరించవచ్చని చెప్పడం సరైనది కాదని.. ఇంకా వేరే మార్గాలు ఎన్నో ఉన్నాయని కపిల్ వెల్లడించారు. ”మీరు భావోద్వేగాలకు గురవుతారు. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య క్రికెట్ మ్యాచులు జరగాలన్న విషయం గురించి తర్వాత చర్చిద్దాం. మీకు అంతగా డబ్బులు అవసరమైతే మొదటిగా సరిహద్దుల్లో చేసే దొంగచాటు పనులు ఆపండి. ఇక దాని ద్వారా వచ్చే డబ్బుతో ఆసుపత్రులు, స్కూళ్లను నిర్మించవచ్చు. అలాగే మాకు నిజంగా డబ్బు అవసరమైతే ఇక్కడ చాలా మత సంస్థలు ఉన్నాయి. వారు ముందుకు రావాలి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి అండగా నిలవడం వాటి బాధ్యత అని కపిల్ దేవ్ స్పష్టం చేశారు.

Read Also:

కరోనా వేళ.. మసీదులకు పోటెత్తారు.. మూల్యం చెల్లిస్తున్నారు..

హమ్మయ్య.. కిమ్ బ్రతికే ఉన్నాడు.. అవన్నీ వట్టి ఫేక్!

డేంజర్ బెల్స్: మే 18 వరకు లాక్ డౌన్ పొడిగింపు..!