గుడ్ న్యూస్.. కరోనా ఇంజక్షన్ క్లినికల్ ట్రయల్స్కు ఐసీఎంఆర్ పర్మిషన్..!
కొవిడ్- 19తో పోరాటం చేసేందుకు అవసరమైన యాంటీబాడీస్ను…. ‘హ్యూమన్ కొవిడ్- 19 ఇమ్యూనో గ్లోబిన్ ఇంజక్షన్’ పేరుతో తయారు చేశామని హైదరాబాద్కు చెందిన ఎంఆర్పీఏ కార్పొరేషన్ వెల్లడించింది. దీనికి ఇప్పటికే ఇండియన్ కౌన్సిపల్ అఫ్ మెడికల్ రీసెర్చ్ గుర్తింపు వచ్చిందని…. క్లినికల్ ట్రయల్స్ జరిపేందుకు సైతం తాజాగా పర్మిషన్ ఇచ్చిందని ఆ సంస్థ ఛైర్మన్, విశాఖకు చెందిన డాక్టర్ శ్రీహరి తెలిపారు. ఈ ఇంజక్షన్ను కోవిడ్-19 నిర్దారణ కాకముందు లేదా నిర్దారణ అయిన తరువాత కూడా ఇవ్వవచ్చని […]
కొవిడ్- 19తో పోరాటం చేసేందుకు అవసరమైన యాంటీబాడీస్ను…. ‘హ్యూమన్ కొవిడ్- 19 ఇమ్యూనో గ్లోబిన్ ఇంజక్షన్’ పేరుతో తయారు చేశామని హైదరాబాద్కు చెందిన ఎంఆర్పీఏ కార్పొరేషన్ వెల్లడించింది. దీనికి ఇప్పటికే ఇండియన్ కౌన్సిపల్ అఫ్ మెడికల్ రీసెర్చ్ గుర్తింపు వచ్చిందని…. క్లినికల్ ట్రయల్స్ జరిపేందుకు సైతం తాజాగా పర్మిషన్ ఇచ్చిందని ఆ సంస్థ ఛైర్మన్, విశాఖకు చెందిన డాక్టర్ శ్రీహరి తెలిపారు. ఈ ఇంజక్షన్ను కోవిడ్-19 నిర్దారణ కాకముందు లేదా నిర్దారణ అయిన తరువాత కూడా ఇవ్వవచ్చని తెలిపారు. దీని ద్వారా ఇమ్యూనో గ్లోబిన్స్ను బాడీలోకి పంపితే అవి కరోనా వైరస్తో పోరాడతాయని వివరించారు. కరోనాకు సమర్థవంతమైన వ్యాక్సిన్ వచ్చేలోపు కొంతమందిని అయినా సేవ్ చెయ్యాలనే లక్ష్యంతో ఇంజక్షన్ను రూపొందించామని ఆయన అన్నారు.
సుమారు 50 మంది పైన క్లినికల్ ట్రయల్స్ చేసి రిపోర్ట్ అందించాలని ఐసీఎంఆర్ కోరిందని డాక్టర్ శ్రీహరి పేర్కొన్నారు. కోవిడ్-19 సోకిన వారు ఎవరైనా స్వచ్ఛందంగా ముందుకు వస్తే వారిపై క్లినికల్ ట్రయల్స్ జరుపుతామన్నారు. పూర్తి స్థాయిలో సక్సెస్ అయితే దీన్ని వెంటనే ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు యత్నిస్తామని శ్రీహరి తెలిపారు. మెరుగైన ఫలితాలు రాకపోతే…. కొవిడ్- 19 కోసమే స్పెషల్ గా యాంటీబాడీస్ను తయారు చేసే పనిలో కూడా తమ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఎంఆర్పీఏ కార్పొరేషన్ ఉందని ఆయన చెప్పారు.