ఆధార్ కార్డు ఇప్పుడు మనకు గుర్తింపు కార్డుగా మారిపోయింది. ప్రభుత్వ పథకాలను పొందలన్న.. రేషన్ సరుకుల నుంచి ఉన్నత విద్య వరకు ప్రతి ఒక్కదానికి ఆధార్ అనుసంధానం చేయాల్సి వస్తుంది. ఇక ఇప్పటికే పలు ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేశాయి. ఇక ఆధార్ లేకపోతే వారికి ఎదురయ్యే ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. ఇక నవజాత శిశువులకు కూడా ఆధార్ కావాల్సిందే. దేశంలోని కొన్ని ఆసుపత్రులలో అప్పుడే పుట్టిన పిల్లల కోసం ఆధార్ కార్డు తయారు చేసే ప్రక్రియను కల్పిస్తున్నాయి. ప్రస్తుత కాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి ఈ ఆధార్ కార్డు ఉండాల్సిందే. ఇందుకు సంబంధించి UIDAI తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.
దేశంలోని ప్రతి ఒక్కరూ ఆధార్ కోసం నమోదు చేసుకోవాలని UIDAI ట్వీట్ చేసింది. నవజాత శిశువు కోసం ఆధార్ కార్డుకు నమోదు చేసుకోవాలని.. ఇందుకోసం పిల్లల బర్త్ సర్టిఫికేట్ మరియు తల్లిదండ్రులలో ఒకరి గుర్తింపు కార్డు. నవజాత శిశువుకు కావాల్సిన ఆధార్ కోసం వారు ఎలాంటి ఫింగర్ ఫ్రింట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బయోమెట్రిక్ డేటా అనేది 5 సంవత్సరాల పిల్లల నుంచి మాత్రమే తీసుకోవడానికి వీలుంటుంది. పిల్లలకు 5 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆ బయోమెట్రిక్ మార్చుకోవచ్చని తెలిపింది.
నవజాత శిశువు కోసం ఆధార్ అప్లై చేయడానికి వారి తల్లిదండ్రులలో ఒకరిది ఆధార్ కార్డు మరియు గుర్తింపు కార్డు అవసరం.
#AadhaarForMyChild
Everyone can enroll for Aadhaar – even a newborn child. All you need is the child’s birth certificate and #Aadhaar of one of the parents. Book an appointment from https://t.co/bn84FITjmx#KidsAadhaar #BaalAadhaar #Identity #Appointment pic.twitter.com/4Q8yXBhKKV— Aadhaar (@UIDAI) February 22, 2021
➦ ముందుగా UIDAI వెబ్సైట్కి వెళ్లి ఆధార్ కార్డ్ రిజిస్ట్రేషన్ కోసం లింక్ పై క్లిక్ చేయాలి.
➦ అనంతరం అప్లై ఫాం పై క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత పిల్లల పేరు, మీ మొబైల్ నంబర్, ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయాలి.
➦ ఆ తర్వాత మీకు సమీపంలోని ఆధార్ కార్డు సెంటర్కు అపాయింట్ మెంట్ లభిస్తుంది.
➦ అవసరమైన సర్టిఫికేట్స్ తీసుకొని అపాయింట్ మెంట్ ఉన్న రోజు.. టైమింగ్ ప్రకారం ఆధార్ సెంటర్కు వెళ్ళి ఆధార్ నమోదు చేసుకోవాలి.
Also Read: ఆధార్ కార్డుకు పాన్ కార్డు అనుసంధానం ఎలా చేయాలి.? 2 నిమిషాల్లో లింక్ చేసుకొండి ఇలా..