Telugu News Human Interest September 1st date is a very historic day, find out history of September 1st and why this day is special
01 september: ఇండియన్ టైమ్ మొదలు ఎల్ఐసీ ఏర్పాటు వరకు.. జ్ఞాపకాల దొంతరలో ఈ రోజు..
01 September Historical Events: క్యాలెండర్ పేజీ మారిపోయింది. నెల మారింది. తేదీ మారింది. రోజు కూడా మారింది. ఈరోజు సెప్టెంబర్ నెలలో మొదటి తేదీ. ప్రతి రోజు.. ప్రతి క్షణం చిరస్మరణీయం.
గతం ఓ జ్ఞాపకం.. అదో చరిత్ర.. గడిచిన కాలంలో ముగిసిన పుటల అధ్యయనమే చరిత్ర. ఒక శాస్త్రంగా నిర్వచించినప్పుడు ప్రాథమికంగా జరిగిన కాలములోని విషయాలు రాతల ద్వారా , మనుషుల, కుటుంబాల, సమాజాల పరిశీలించి అధ్యయనం చేసి భద్రపరచబడినదానిని చరిత్ర అని చెప్పవచ్చు. అలాగే ప్రతి రోజు, ప్రతి తేదీకి కొంత చరిత్ర ఉన్నప్పటికీ, వాటిని మనం వివరంగా అర్థం చేసుకోలేం. చరిత్ర పేజీలలో ఈ రోజుకు చాలా ప్రత్యేకత ఉంది. ఇవాళ చరిత్రలో సెప్టెంబర్ మొదటి రోజు కూడా చాలా రకాలుగా ప్రత్యేకమైనది. క్యాలెండర్ పేజీ మారిపోయింది. నెల మారింది. తేదీ మారింది. రోజు కూడా మారింది. ఈరోజు సెప్టెంబర్ నెలలో మొదటి తేదీ. ప్రతి రోజు.. ప్రతి క్షణం చిరస్మరణీయం.
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక దినోత్సవం
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) అంటే తెలియనివారు ఉండరు. దేశంలోని దాదాపు ప్రతి ఇంటికి సుపరిచితమైన పేరు. దాదాపు ప్రతి ఇంట్లో ఒకరో ఇద్దరో ఎల్ఐసీ పాలసీని తీసుకుని ఉంటారు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్వాతంత్ర్యం వచ్చిన 9 సంవత్సరాల తర్వాత 1 సెప్టెంబర్ 1956న ‘జిందగీ సాథ్ భీ, జిందగీ బాద్ భీ’ అనే ప్రభావవంతమైన ట్యాగ్లైన్తో స్థాపించబడింది.
సెప్టెంబర్ 01.. చరిత్రలో ఈ రోజు..
1858: ఈస్ట్ ఇండియా కంపెనీ డైరెక్టర్ల చివరి సమావేశం సరిగ్గా ఈ రోజే జరిగింది. సెప్టెంబర్ 1న లండన్లోని ఈస్ట్ ఇండియా హౌస్లో జరిగింది.
1878: ఎమ్మా ఎం. నట్ అమెరికాలో మొదటి మహిళా టెలిఫోన్ ఆపరేటర్ అయ్యారు.
1909: ప్రముఖ సాహిత్యవేత్త, నిఘంటువు రచయిత ఫాదర్ కమిల్ బుల్కే జననం.
1923: గ్రేట్ కాంట్ భూకంపం జపాన్లోని టోక్యో, యోకోహామా నగరాల్లో పెను విధ్వంసం సృష్టించింది.
1942: రాష్ బిహారీ బోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించారు.
1947: భారత ప్రామాణిక కాలమానం(Indian Standard Time) సెప్టెంబర్ 1న ప్రవేశపెట్టబడింది.
1964: ఇండియన్ ఆయిల్ రిఫైనరీ, ఇండియన్ ఆయిల్ కంపెనీని విలీనం చేయడం ద్వారా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఏర్పడింది.
2000: టిబెట్ మీదుగా నేపాల్కు చైనా తన ఏకైక మార్గాన్ని మూసివేసింది.
2018: జకార్తా ఆసియా క్రీడల్లో బాక్సర్ అమిత్ పంఘల్ 49 కిలోల విభాగంలో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన ఎనిమిదో భారతీయ బాక్సర్గా నిలిచాడు.
2018: జకార్తా ఆసియా క్రీడల పురుషుల బ్రిడ్జ్ ఈవెంట్ డబుల్స్ ఈవెంట్లో ప్రణబ్ బర్ధన్ , శిబ్నాథ్ సర్కార్ స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు.
2020: భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సెప్టెంబర్ 1న ఢిల్లీలో పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. అతను ఆగస్టు 31 న మరణించాడు.