ఎలక్ట్రిక్ వెహికల్స్ విద్యుత్ వేగంతో దూసుకొస్తున్నాయి. మార్కెట్ను ఆక్రమించే రెడీ అవుతున్నాయి. అలా అని పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గడం లేదు. ప్రతి నెలా పెరుగుతూనే పోతోంది. మన దేశంలో ముడి చమురు లభ్యత తక్కువ. అందుకే మనం 80 శాతం దిగుమతి చేసుకుంటాం. క్రూడ్ రేటు, దిగుమతి సుంకాలు, రవాణా చార్జీలు, ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్, డీలర్ మార్జిన్ ఇలాంటి ట్యాక్సులు అన్ని కలుపుకోవడం వల్ల పెట్రోల్, డీజిల్ రేట్లు భారీగా పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో మనం ఫిల్లిగ్ చేయించుకున్న పెట్రోల్ కల్తీ అని తక్కువగా వచ్చిందనే అనుమానాలు సహజం. తాము ఏదో ఒక పెట్రోల్ పంపులో మోసపోయామని లేదా ఏదైనా ఫ్యూయల్ స్టేషన్లో ఇంధనం నాణ్యత లేదని లేదా ఇంధన కొలత ఎక్కడో తక్కువగా ఉందని మీరు చాలా మంది చెప్పడం తరచుగా వింటూ ఉంటారు.. కొన్నిసార్లు మీరు కూడా ఎప్పుడూ అలా భావించి ఉండకపోవచ్చు. ఈ ఫిర్యాదుల్లో చాలా వరకు నిజం కూడా ఉంది. అటువంటి పరిస్థితిలో చాలా మంది ఏమీ చేయరు. ఆ ఇంధన స్టేషన్కు వెళ్లడం మానేస్తారు.
కానీ అలాంటి పెట్రోల్ పంపులో ఇంధనాన్ని నింపుకోవడం మానేయడం కాదు మనం చేయాల్సింది. ఎక్కడైతే అనుమానం వచ్చిందో అక్కడే దానికి పరిష్కారం వెతుకాలి. కల్తీని ప్రశ్నించే హక్కు ప్రతి వినియోగదారుడికి ఉంటుంది. అయితే ఎలా పెట్రోల్ పంపు యాజమాన్యంను ప్రశ్నించాలి. ఇలా జరిగే మోసాల గురించి ఎలా అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..
మరిన్నిహ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం