
చాలా మంది చాక్లెట్ లేదా స్వీట్లు తిన్న తర్వాత తాజాగా, చురుకుగా ఉన్నట్లు భావిస్తారు. కానీ ఆ తర్వాతి కొద్ది నిమిషాల్లోనే, వారు చాలా అలసిపోయినట్లు కనిపిస్తారు. దీనికి కారణం మీ శరీరం చక్కెరను నిర్వహించే విధానమే. అవును.. స్వీట్ తిన్న తర్వాత.. ముఖ్యంగా మొదటి 30 నిమిషాలు మీకు మధుమేహం ఉందో లేదో నిర్ధారించుకోవడానికి ఒక అవకాశాన్ని కల్పిస్తాయని.. ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతర్గత వైద్య విభాగం కన్సల్టెంట్ డాక్టర్ మెలిస్సా సత్యన్ మాట్లాడుతూ.. “చక్కెర తిన్న 30 నిమిషాలలోపే రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరగడం మొదలవుతుంది. దీనివల్ల క్లోమం ఇన్సులిన్ అనే హార్మోన్ను స్రవిస్తుంది.” అని పేర్కొన్నారు.
“జీవక్రియ సమస్యలు లేని, సాధారణ ఇన్సులిన్ సున్నితత్వం ఉన్న వ్యక్తులలో, కణాలు గ్లూకోజ్ను సమర్థవంతంగా గ్రహించడానికి ఇన్సులిన్ సహాయపడుతుంది. ఇది గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించి, అవసరమైన శక్తిని అందిస్తుంది.” అని తెలిపారు..
మధుమేహం లేని వారి శరీరంలో ఇన్సులిన్ స్రావం స్థిరంగా ఉంటుంది. తీపి పదార్థాలు తిన్న తర్వాత రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరిగినా, అది వెంటనే స్థిరపడుతుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలలో హెచ్చుతగ్గులు నివారించబడతాయి.
మధుమేహం ఉన్నప్పుడు, ఇన్సులిన్ స్రావం, ఇన్సులిన్ సున్నితత్వం తగ్గుతాయి. దీనివల్ల రక్తంలో చక్కెర పేరుకుపోతుంది. ఇది తీవ్రమైన అలసట, అధిక దాహం, తరచుగా మూత్రవిసర్జన వంటి లక్షణాలకు దారితీస్తుంది.
చక్కెర తిన్న తర్వాత శరీరానికి జరిగే మార్పులన్నీ సాధారణమైనవి కావు. కింద పేర్కొన్న లక్షణాలలో ఏవైనా మీకు తరచుగా కనిపిస్తే, మీరు వెంటనే వైద్య సలహా తీసుకోవాలి.
వైద్యుని ప్రకారం, “చక్కెర తిన్న మొదటి 30 నిమిషాలలో శరీరంలో జరిగే జీవక్రియ ప్రతిస్పందన, ఒక వ్యక్తికి ఆరోగ్యకరమైన జీవక్రియ ఉందో లేక మధుమేహం వంటి జీవక్రియ రుగ్మత ఉందో నిర్ధారించడానికి సహాయపడుతుంది.”
కాబట్టి, తీపి పదార్థాలు తిన్న తర్వాత మీ శరీరంలో జరిగే మార్పులను గమనించండి. పైన పేర్కొన్న హెచ్చరిక సంకేతాలు నిరంతరం కనిపిస్తే, ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించడం జీవక్రియ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
ఈ వార్తా కథనం వైద్యుల సూచనల మేరకు అందించడం జరిగింది.. అయితే.. మీకు ఏమైనా సందేహాలున్నా.. ఆరోగ్య సమస్యలున్నా.. నేరుగా వైద్య నిపుణులను సంప్రదించండి..
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..