Corona Tests: కరోనా పరీక్షలకు మరో చౌకైన విధానం..పెన్సిల్ ముల్లులోవాడే గ్రాఫైట్ తో కరోనా కనిపెట్టేయొచ్చు.. ఎలా అంటే.. 

అమెరికన్ శాస్త్రవేత్తలు కొత్త కరోనా పరీక్షను అభివృద్ధి చేశారు. పెన్సిల్ కొనలో ఉపయోగించే గ్రాఫైట్ సహాయంతో, కోవిడ్‌ను కేవలం 6.5 నిమిషాల్లో పరీక్షించవచ్చు.

Corona Tests: కరోనా పరీక్షలకు మరో చౌకైన విధానం..పెన్సిల్ ముల్లులోవాడే గ్రాఫైట్ తో కరోనా కనిపెట్టేయొచ్చు.. ఎలా అంటే.. 
Corona Testing

Updated on: Aug 21, 2021 | 5:26 PM

Corona Tests: అమెరికన్ శాస్త్రవేత్తలు కొత్త కరోనా పరీక్షను అభివృద్ధి చేశారు. పెన్సిల్ కొనలో ఉపయోగించే గ్రాఫైట్ సహాయంతో, కోవిడ్‌ను కేవలం 6.5 నిమిషాల్లో పరీక్షించవచ్చు. కొత్త కరోనా పరీక్ష చౌకగానూ..వేగంగా ఉంటుందని, 100 శాతం వరకు ఖచ్చితమైన ఫలితాలను ఇస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

కోవిడ్ కోసం కొత్త పరీక్షను అభివృద్ధి చేసిన అమెరికాలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు, ప్రస్తుతం అందుబాటులో ఉన్న చాలా కరోనా పరీక్షలు ఖరీదైనవని చెప్పారు. దీని కోసం, శిక్షణ పొందిన ప్రొఫెషనల్ అవసరం, కానీ గ్రాఫైట్ పరీక్షతో, దాని ధర రూ .100 వరకు తగ్గించవచ్చు. ఈ పరీక్షకు LEED (తక్కువ ధర ఎలక్ట్రోకెమికల్ అడ్వాన్స్‌డ్ డయాగ్నోస్టిక్) పరీక్ష అని పేరు పెట్టారు.

పరీక్ష ఎలా చేస్తారు.. 

ఈ పరీక్షలో ఉపయోగించే ప్రోబ్ కోసం ఒక గ్రాఫైట్ స్టిక్  ఎలక్ట్రోడ్ లా ఉపయోగపడుతుంది.  ఇది లాలాజలం లేదా నాసికా నమూనాలు, మానవ యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ -2 తో పరీక్షించడానికి వీలు కల్పిస్తుంది. గ్రాఫైట్ ఎలక్ట్రోడ్ ఒక రసాయన సంకేతానికి అనుసంధానించబడి ఉంటుంది. పరీక్ష  సమయంలో, రోగి కరోనా పాజిటివ్ లేదా నెగెటివ్ అనేవిషయాన్ని రసాయన సంకేతాలు తెలియచేస్తాయి.  లాలాజల నమూనాలతో పరీక్షించినప్పుడు 100 శాతం వరకు ఖచ్చితమైన పరీక్ష ఫలితాలు లభిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అదే సమయంలో, గ్రాఫైట్ ఎలక్ట్రోడ్లతో ముక్కు నమూనాను పరీక్షించినప్పుడు 88 శాతం వరకు ఖచ్చితమైన ఫలితాలు వెల్లడవుతాయని వారంటున్నారు.

దిగువ-మధ్య-ఆదాయ దేశాలకు ప్రయోజనకరమైనది

పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ సీజర్ డి లా ఫ్యూంటె, ”ఈ లీడ్ టెస్ట్ కిట్‌లో ఉపయోగించిన మెటీరియల్ తక్కువ ధరలో లభిస్తుందని చెప్పారు. కిట్ సమీకరించడం కూడా సులభం. ఏ లేమన్ అయినా ఇంట్లో పరీక్షించడానికి అనుమతిస్తుంది. కరోనా పరీక్షల కోసం జరిపిన ఈ పరిశోధన ఫలితం ముఖ్యంగా దిగువ-మధ్య ఆదాయ దేశాలకు ఉపయోగకరంగా ఉంటుంది.” అని చెప్పారు.

పరిశోధకుడు సీజర్ డి మాట్లాడుతూ  “మేము పరిశ్రమ భాగస్వాములతో మరింత క్లినికల్ ట్రయల్స్ చేస్తాము. ట్రయల్ ఫలితాల తర్వాత వీలైనంత త్వరగా ఈ పరీక్ష సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంటుంది” అని చెప్పారు.

ఈ పరీక్షా పద్ధతి ఇతర అంటు వ్యాధులను కూడా గుర్తించగలదాని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇతర వ్యాధులను తెలుసుకోవడం కోసం ఈ పరీక్షను సిద్ధం చేయడానికి పరిశోధనలు జరుగుతున్నాయని వారు చెబుతున్నారు.

కరోనా వైరస్ విరుచుకుపడిన కొత్తలో.. పరీక్షలు చేయడం చాలా క్లిష్టంగా ఉండేది. తరువాత కరోనా పరీక్షల కోసం కొన్ని విధానాలు.. పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే, ఈ విధానాల్లో పరీక్షలకు కొన్ని పరిమితులు ఉన్నాయి. వేగంగా ఫలితం వచ్చే పరీక్ష కోసం ఖర్చు ఎక్కువ అవడం.. నిదానంగా వచ్చే పరీక్ష ఫలితం కోసం ఎదురుచూసేలోగా సంక్రమణ పెరిగిపోవడం.. ఇలా రకరకాలైన ఇబ్బందులు ఎదురయ్యాయి. తరువాత మరి కొన్ని విధానాలను శాస్త్రవేత్తలు కనుగొన్నప్పటికీ అన్నీ కూడా ఖరీదైనవిగా ఉన్నాయి. అయితే, ఇప్పుడు శాస్త్రవేత్తలు కొత్తగా కనిపెట్టిన ఈ గ్రాఫైట్ విధానం (LEED) తక్కువ ఖర్చుతోనూ.. వేగవంతంగానూ ఫలితాలను వెల్లడిస్తుంది.

Also Read: Covid 19 Vaccine: కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీలో తెలంగాణ సరికొత్త రికార్డు.. 100 శాతం వ్యాక్సినేషన్ దిశగా అడుగులు

Delta Cases: వ్యాక్సిన్‌ వేసుకున్నా వదలని డెల్టా..! బ్రిటన్, అమెరికాలో అతాలాకుతలం..

Loading...
Unable to load recommendations.
Follow Us