మధుమేహ వ్యాధిగ్రస్తులకు, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడం చాలా కష్టమైన పని.. అందుకే.. డయాబెటిస్ బాధితులు ఆహారంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఆహారం తీసుకోవడంలో కొంచెం తగ్గుదల కూడా రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. అందుకే.. మధుమేహ వ్యాధిగ్రస్తులు తక్కువ కొవ్వు పదార్ధాలను మాత్రమే తినాలంటారు.. రక్తంలో చక్కెర పరిమాణం పెరగడాన్ని నియంత్రించడానికి తక్కువ కొవ్వు, ఫైబర్ అధికంగా ఉండే సమతుల్య ఆహారం సిఫార్సు చేస్తారు. వాస్తవానికి.. చాలా మంది రోజువారీ ఆహారంలో భాగంగా పాలు తాగుతుంటారు. పాలలో క్యాల్షియం, ప్రొటీన్లు, విటమిన్ డి పుష్కలంగా ఉన్నాయని, ఎముకలు బలపడతాయని నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ, పాలలో రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే కొవ్వులు ఉన్నాయని.. దీనికి కొన్ని చిట్కాలు పాటించడం మంచిదని చెబుతుంటారు..