గ్రామ/వార్డు సచివాలయ మహిళా ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్న్యూస్
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ/వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు గుడ్న్యూస్ చెప్పింది
AP Secretariat women employees: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ/వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు గుడ్న్యూస్ చెప్పింది. సాధారణ ఉద్యోగుల తరహాలోనే వారికి 180 రోజుల ప్రసూతి సెలవులు కేటాయిస్తూ తాజాగా అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. అయితే ప్రస్తుతం రెండేళ్ల ప్రొబేషన్ కాలంలో విధులు నిర్వహిస్తోన్న గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎలాంటి ప్రసూతి సెలవులను ఇవ్వలేదు. దీంతో వారు అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇక అందులో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల నుంచి సెలవులపై ఇటీవల వరుస విజ్ఞప్తులు రావడంతో వాటిని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం 180 రోజుల ప్రసూతి సెలవులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నిర్ణయంతో వేల సంఖ్యలో మహిళా ఉద్యోగులకు ప్రసూతి సమయంలో లబ్ది చేకూరనుంది.
Read more:
‘నిశ్శబ్దం’ అనుష్క దగ్గరికి అలా వెళ్లిందట.. రివీల్ చేసిన దర్శకుడు