గ్యాస్ సిలిండర్ పేలుడు ధాటికి నలుగురు మృతి, 23 మందికి గాయాలు
కరోనా వేళ సిరియాలో మరో విషాదం చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్లు పేలిన ఘటన.. పలువురి కుటుంబాల్లో విషాదన్ని నింపింది. సిరాయా దేశంలోని అలెప్పో నగరంలో సిలిండర్లు పేలిన ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇరవై మూడు మంది తీవ్రంగా గాయపడ్డారు. అలెప్పో నగరంలోని ఓ బిల్డింగ్ వద్ద ఉన్న స్టోర్ హౌస్ సమీపంలో ఈ గ్యాస్ సిలిండర్లు పేలాయి. దీంతో ఘటనాస్థలంలో ఉన్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో 23 మంది తీవ్రంగా గాయాలపాలయ్యారు. […]
కరోనా వేళ సిరియాలో మరో విషాదం చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్లు పేలిన ఘటన.. పలువురి కుటుంబాల్లో విషాదన్ని నింపింది. సిరాయా దేశంలోని అలెప్పో నగరంలో సిలిండర్లు పేలిన ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇరవై మూడు మంది తీవ్రంగా గాయపడ్డారు. అలెప్పో నగరంలోని ఓ బిల్డింగ్ వద్ద ఉన్న స్టోర్ హౌస్ సమీపంలో ఈ గ్యాస్ సిలిండర్లు పేలాయి. దీంతో ఘటనాస్థలంలో ఉన్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో 23 మంది తీవ్రంగా గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీం.. ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారందరికీ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇక సిలిండర్ల పేలుడు ధాటికి.. అక్కడ ఉన్న భవనం దెబ్బతింది.