తీవ్రమైన వేడిలో ఒత్తిడితో కూడిన పనుల సమయంలో ఫ్రెష్గా ఉండేలా సహాయపడే లక్ష్యంతో eRZL రెండు తెలుగు రాష్ట్రాలలో హైడ్రేషన్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మెదక్లో అవగాహన కార్యక్రమం చేపట్టారు. రోజువారీ పనులు, ప్రయాణాలు, బహిరంగ కార్యకలాపాలతో బిజీగా ఉండే వారి వద్దకు eRZL బృందం ప్రత్యక్షంగా వెళ్లింది. వేసవిలో అధిక చెమట కారణంగా శరీరం నీటిని మాత్రమే కాకుండా, కీలకమైన ఎలక్ట్రోలైట్లను కూడా కోల్పోతుంది. దీనివల్ల డీహైడ్రేషన్ ఏర్పడి, అలసట కలుగుతుంది. ఈ ప్రమాదం గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి eRZL మెదక్లోని ప్రధాన ప్రాంతాలలో క్షేత్ర స్థాయి శాంపిలింగ్ కార్యక్రమాలను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భాగంగా తమ అలసటతో కూడిన, సుదీర్ఘమైన పని దినాలలో ఎలక్ట్రోలైట్లను తిరిగి నింపుకోవడం ఎంత అవసరమో వివరించారు. eRZL ఉత్పత్తులను ప్రత్యక్షంగా స్వీకరించడం ద్వారా, వినియోగదారులు హైడ్రేషన్ ప్రాముఖ్యతను గ్రహించారు. మెదక్లో ఈ అవగాహన కార్యక్రమానికి మంచి స్పందన లభించింది.