జేడీ-యూ వైపు బీహార్ మాజీ డీజీపీ చూపు !
బీహార్ మాజీ డీజీపీ గుప్తేశ్వర్ పాండే శనివారం సీఎం నితీష్ కుమార్ తో భేటీ అయ్యారు. దీంతో ఆయన పాలక జేడీ-యూ లో చేరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. రాష్ట్ర పోలీసు విభాగం నుంచి ఆయన స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారు..
బీహార్ మాజీ డీజీపీ గుప్తేశ్వర్ పాండే శనివారం సీఎం నితీష్ కుమార్ తో భేటీ అయ్యారు. దీంతో ఆయన పాలక జేడీ-యూ లో చేరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. రాష్ట్ర పోలీసు విభాగం నుంచి ఆయన స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారు. తాను జేడీ-యూలో చేరాలా వద్దా అన్న విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, అయితే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ ఉందని సూచనప్రాయంగా చెప్పారు. తన బక్సర్ నియోజకవర్గ ప్రజలు తనను ఇక్కడినుంచి పోటీ చేయాలని కోరుతున్నారని, దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని గుప్తేశ్వర్ పాండే చెప్పారు. ఈ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి.
I came here to meet CM Nitish Kumar & to thank him as he gave me absolute freedom to serve my duties as DGP. I have yet not taken any decision on contesting polls: Gupteshwar Pandey, former Bihar DGP on being asked about him joining a political party, ahead of #BiharElections2020 pic.twitter.com/EkqiqDM9HT
— ANI (@ANI) September 26, 2020