Venkatesh as lecture: విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం నారప్ప అనే చిత్రంలో నటిస్తున్నారు. తమిళంలో విజయం సాధించిన అసురన్ రీమేక్గా ఈ మూవీ తెరకెక్కుతుండగా.. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియమణి, వెంకీ భార్య పాత్రలో కనిపించనుంది. లాక్డౌన్తో బ్రేకుల పడ్డ ఈ మూవీ షూటింగ్ త్వరలోనే తిరిగి ప్రారంభం కాబోతోంది. కాగా నారప్ప తరువాత వెంకటేష్, ఎఫ్ 3లో నటించనున్నారు. దీంతో పాటు యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ దర్శకత్వంలోనూ వెంకీ ఓ మూవీలో నటించనున్నారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. (ఆకాశాన్ని అంటిన ఉల్లి ధరలు.. క్వింటా రూ.7వేలు)
ఇక ఈ మూవీ గుర్రపు పందేల బ్యాక్డ్రాప్లో ఉండనున్నట్లు తెలుస్తుండగా.. ఇందులో వెంకీ లెక్చరర్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఆయన పాత్ర వినోదాత్మకంగా ఉండబోతున్నట్లు టాక్. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో సురేష్ బాబు నిర్మించనున్న ఈ మూవీని వచ్చే ఏడాది వేసవిలో ప్రారంభింబోతున్నట్లు ఫిలింనగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. కాగా గతంలో వెంకటేష్ సుందరాకాండలో లెక్చరర్గా కనిపించిన విషయం తెలిసిందే. (పృథ్వీరాజ్కి కరోనా నెగిటివ్)