Year Ender 2025: ఈ ఏడాది ఎక్కువ సినిమాలు చేసిన బ్యూటీ.. కట్ చేస్తే అన్ని ఫ్లాపే

మరికొద్ది రోజుల్లో 2025కు గుడ్ బై చెప్పనున్నాం.. కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పడానికి అందరూ సిద్ధమయ్యారు. కాగా ఈ ఏడాది చాలా వింతలు విశేషాలు జరిగాయి. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో.. కొంతమంది పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. అలాగే మరికొంతమంది విడిపోయారు. ఇక మరికొందరు లెజెండ్స్ కన్నుమూశారు.

Year Ender 2025: ఈ ఏడాది ఎక్కువ సినిమాలు చేసిన బ్యూటీ.. కట్ చేస్తే అన్ని ఫ్లాపే
Actress

Updated on: Dec 08, 2025 | 2:06 PM

2024కు త్వరలోనే గుడ్ బై చెప్పనున్నాం. ఇక ఈ ఏడాది సినిమా ఇండస్ట్రీలో చాలా సంఘటనలు జరిగాయి. ఊహించని విధంగా కొంతమంది పెళ్లి చేసుకున్నారు. అలాగే ఇంకొంతమంది విడాకులు తీసుకున్నారు. ఇంకొంతమంది ప్రేమలో పడ్డారు. అదేవిధంగా మరికొంతమంది భామలు స్టార్ డమ్ కూడా తెచ్చుకున్నారు. ఇక కొంతమంది ఈ ఏడాది సినిమాలు చేయకుండా ఉండిపోయారు. మరికొంతమంది వరుస సినిమాలతో దూసుకుపోయారు. ఇక ఈ ఏడాది ఎక్కువ సినిమాలు చేసిన టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా.? ఆమె చేసిన సినిమాలన్నీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కానీ ఒక్క సినిమా కూడా విజయం సాధించలేదు అదే విశేషం.. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.?

రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా.. షాకింగ్ విషయం చెప్పిన నటుడు

ఆమె పేరు ప్రస్తుతం టాలీవుడ్ లో మారు మ్రోగుతుంది. ఏ స్టార్ హీరో సినిమా చూసిన ఆమె కనిపిస్తుంది. అలాగే యంగ్ హీరోల సినిమాలకు కూడా ఆమె మొదటి ఛాయిస్ అవుతుంది. ఆమె ఎవరో కాదు లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల. కన్నడ భాష నుంచి వచ్చిన ఈ తెలుగమ్మాయి.. తెలుగులో పెళ్ళిసందడి అనే సినిమాతో పరిచయం అయ్యింది. ఆతర్వాత రవితేజ ధమాకా సినిమాతో హిట్ అందుకుంది. ఇక తెలుగులో మహేష్ బాబులాంటి స్టార్ హీరోలతోనూ నటించింది. ఇటీవలే పుష్ప 2లో స్పెషల్ సాంగ్ లోనూ అదరగొట్టింది.

ఇవి కూడా చదవండి

చేసింది ఒకే ఒక్క సినిమా.. అది కూడా స్టార్ హీరోతో.. కట్ చేస్తే రూ.44,250 కోట్లకు మహారాణి.

ఇక ఈఏడాది తెలుగులో ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్ గా నిలిచింది శ్రీలీల.  రష్మిక మందన్న ఈ ఏడాది ఎక్కువ సినిమాలు చేసింది కానీ ఆమె తెలుగుతో పాటు హిందీలో కూడా నటించింది. కానీ తెలుగులో ఎక్కువ సినిమాలు చేసింది మాత్రం శ్రీలీలనే.. ఈ ఏడాది మొదట్లో రాబిన్‌హుడ్ అనే సినిమా చేసింది. నితిన్ హీరోగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆతర్వాత జూనియర్ అనే సినిమా చేసింది. ఈ సినిమా కూడా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఇక చివరిగా మాస్ జాతర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రవితేజ హీరోగా నటించిన మాస్ జాతర సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.

చేసింది 8 సినిమాలు అందులో ఆరు ఫ్లాపులు.. అందంలో మాత్రం అజంతా శిల్పం

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి