
సెంట్రల్ తమిళనాడులో రోడ్ ట్రిప్కి వెళ్లారు రాజమౌళి. కుమార్తె అడగటంతో ఈ విజిట్ చేసినట్టు తెలిపారు. గత కొన్నాళ్లుగా ఫారిన్ ట్రిప్లో ఉండి, ఇప్పుడు సొంత నేల మీద తిరుగుతుంటే రిఫ్రెషింగ్గా ఉందనిపించిందన్నారు. శ్రీరంగం, దారాసురం, బృహదీశ్వరాలయం, రామేశ్వరం, తూత్తుకుడి, మదురైకి వెళ్లినట్టు చెప్పారు. అక్కడి విజువల్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేశారు.

రామ్ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా డబుల్ ఇస్మార్ట్. వీరి కాంబినేషన్లో వచ్చిన ఇస్మార్ట్ మూవీకి సీక్వెల్ ఇది. ఈ కేరక్టర్ కోసం పూర్తిగా మేకోవర్ అయ్యారు రామ్ పోతినేని. రేపటి నుంచి డబుల్ ఇస్మార్ట్ రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని ప్రకటించారు మేకర్స్. వచ్చే ఏడాది మార్చి 8న డబుల్ ఇస్మార్ట్ ప్యాన్ ఇండియా రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారు

అశ్విన్ బాబు కథానాయకుడిగా నటించిన సినిమా హిడింబ. అనీల్ కన్నెగంటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. ఈ నెల 20న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇంతకు మునుపెప్పుడూ ఇలాంటి కథను చూడలేదనే హింట్స్ ఇస్తున్నారు మేకర్స్. నందిత శ్వేత నాయికగా నటించారు.

కర్ణాటక కూర్గులోని తన ఇల్లంటే ఎంతో ఇష్టమని చెప్పారు రష్మిక. నెటిజన్లతో ముచ్చటించారు ఈ భామ. తనకు ఆరు భాషలు వచ్చని అన్నారు. ఏ ప్రదేశానికి వెళ్తే వాళ్లతో కలిసిపోవడాన్ని ఇష్టపడతానని చెప్పారు. హిందీలో యానిమల్లో నటిస్తున్నారు రష్మిక. తెలుగులో పుష్ప2, రెయిన్బో తో పాటు మరికొన్ని సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి.

అక్షయ్కుమార్ హీరోగా నటించిన సినిమా ఓమైగాడ్2. ఇందులో ఆయన ఈశ్వరుడి అవతారంగా కనిపించనున్నారు. ఓ మై గాడ్ 2 టీజర్కి మంచి స్పందన వస్తోంది. వచ్చే నెల 11న విడుదల కానుంది ఓ మై గాడ్2. మైండ్ బ్లోయింగ్ టీజర్. హర్హర్మహదేవ్ అంటూ నెటిజ్లను సపోర్ట్ చేస్తున్నారు. గత కొన్నాళ్లుగా మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు అక్షయ్