Tollywood: వెండితెరపై విరామం… క్లైమాక్స్‌పై ఉత్కంఠ!

అన్నపూర్ణ స్టూడియోలో 'ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌' షూటింగ్‌ను అడ్డుకోవడం ఏంటని టాలీవుడ్‌లో పెద్ద చర్చ జరుగుతోందట. బిగ్‌ బ్రేకింగ్‌ న్యూస్‌ అయిందది. ఆ సినిమా యూనిట్‌తో పెద్ద వాగ్వాదమే జరిగిందనేది ఓ టాక్. ఒక్క ఆ సినిమాకే కాదు... తెలుగు సినిమా పరిశ్రమలో పెద్ద యుద్ధమే జరుగుతోందిప్పుడు. ఏమంటే... సినీ కార్మికులకు వేతనాలు పెంచండి, అప్పుడే వాళ్లని పనిలోకి పంపిస్తామని యూనియన్లు చెబుతున్నాయి. అదేంటి.. ఇప్పుడిస్తున్న వేతనాలే ఎక్కువ కదా, ఇంకా పెంచితే ఆరిపోమా అని నిర్మాతలు వాదిస్తున్నారు. పెంచితేనే కార్మికులు షూటింగ్‌కు వస్తారని ఫెడరేషన్.. పెంచే ప్రసక్తే లేదు అని ఫిల్మ్‌ ఛాంబర్. ఒకవిధంగా కార్మిక సంఘాలకు, నిర్మాతల మండలికి మధ్య ఊహించిన దానికి మించి యుద్ధం నడుస్తోంది. అసలు యూనియన్ల నుంచే ఎందుకు కార్మికులను తీసుకోవాలి... దేశంలో మాఇష్టం వచ్చిన రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకుంటామనేది నిర్మాతల అల్టిమేటం. అలా బయటి వాళ్లను తెచ్చుకుంటే ఊరుకునేది లేదని యూనియన్ల వార్నింగ్‌. సో, చిన్న గొడవేం కాదిది? చూస్తుంటే ఇప్పట్లో పుల్‌స్టాప్‌ పడేలా కనిపించడంలేదు కూడా. మరి.. సినీ పెద్దలు చూపుతున్న పరిష్కారం ఏంటి?

Tollywood: వెండితెరపై విరామం... క్లైమాక్స్‌పై ఉత్కంఠ!
Tollywood Shut

Updated on: Aug 05, 2025 | 9:45 PM

సినిమాల్లో యాక్షన్‌ సీక్వెన్స్‌లో భాగంగా ఫైటింగ్‌ జరుగుతుంటుంది. బట్.. షూటింగ్‌లను అడ్డుకునేలా ఫైటింగ్‌ జరుగుతోందిప్పుడు. రీల్‌లో ఉండాల్సిన సీన్‌ రియల్‌గానే కనిపిస్తోంది. ఇందాక చెప్పుకున్నట్టు కార్మిక సంఘాలు, నిర్మాతల మండలికి మధ్య గొడవ చాలా సీరియస్‌గా జరుగుతోంది. ‘ఎందుకని తాము యూనియన్ల నుంచే సినీ కార్మికులను తెచ్చుకోవాలి’ అనేది ప్రొడ్యూసర్ల సూటి ప్రశ్న. అందుకే, ముంబై, చెన్నై కార్మికులతో షూటింగ్ పూర్తి చేస్తున్నాయి కొన్ని బ్యానర్లు. మరి ఆ సినిమా షూటింగ్‌ను అడ్డుకున్నట్టే అన్నింటినీ అడ్డుకుంటాయా యూనియన్లు? నిర్మాతలు బయటి వాళ్లను తెచ్చుకుని పని నడిపిస్తే ఇక్కడోళ్ల పరిస్థితేంటి? కార్మికులు కోరుతున్న వేతనాల పెంపులో న్యాయం కనిపించడం లేదా?  తెలుగు ఫిల్మ్‌ ఫెడరేషన్ చెబుతున్న వర్షన్‌లో.. టాలీవుడ్‌లో ఓ ఒప్పందం ఉంది. ప్రతీ మూడేళ్లకోసారి 30 శాతం వేతనాలు పెంచడం సంప్రదాయం అనేది ఫెడరేషన్ చేస్తున్న వాదన. కరోనా ఎఫెక్ట్ కావొచ్చు, మరేదైనా కారణాలు కావొచ్చు… నాలుగేళ్లుగా సినీ కార్మికులు వేతనాల పెంపు అడగట్లేదని చెబుతోంది ఫెడరేషన్. దీనికోసం ఎన్నోసార్లు ఫిల్మ్‌ ఛాంబర్‌ మెట్లు ఎక్కాం, నిర్మాతలతో మాట్లాడాం అంటోంది కూడా. ఎన్నిసార్లు అడిగినా వేతనాలు పెంచడం లేదు కాబట్టే సమ్మెకు దిగాం అనేది ఫెడరేషన్‌ చెబుతున్న సమాధానం. ఎవరైతే వేతనాలను 30 శాతం పెంచుతారో వారి సినిమాలకే పనిచేస్తామని నిర్మాతల మండలికి ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఒక అల్టిమేటం కూడా ఇచ్చింది. అంతేకాదు.. ఆ వేతనాలను కూడా రోజువారీగా చెల్లించాలి తప్ప పెండింగ్‌ పెట్టకూడదనేది...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి