
కేజీఎఫ్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది శ్రీనిధి శెట్టి. కేజీఎఫ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి నటించి మెప్పించింది. సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ఈ సినిమా తర్వాత శ్రీనిధి శెట్టి వరుస సినిమాలతో బిజీ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఆమె తర్వాత విక్రమ్ సరసన కోబ్రా సినిమాలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దాంతో ఈ అమ్మడికి సినిమా ఛాన్సులు తగ్గాయి. ప్రస్తుతం సినిమాలు లేక ఖాళీగా ఉంది. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ భామ. తాజాగా శ్రీనిధి శెట్టి తన సెల్ఫీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.