Priyanka Chopra: కుంభమేళాలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా.. అసలు విషయం ఇదే

లాస్‌ ఏంజెలెస్‌ నుంచి ప్రియాంక చోప్రా కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌ వచ్చారు. మహేశ్‌ బాబు హీరోగా రాజమౌళి డైరెక్ట్ చేస్తోన్న SSMB29 లో ప్రియాంకను హీరోయిన్‌గా తీసుకున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు నెట్టింట సర్కులేట్ అవుతున్నాయి. ఆ ప్రాజెక్టు కోసమే ఆమె హైదరాబాద్‌ వచ్చారని చెబుతున్నారు.

Priyanka Chopra: కుంభమేళాలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా.. అసలు విషయం ఇదే
Priyanka Chopra

Updated on: Jan 24, 2025 | 8:20 AM

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా రీసెంట్ గా హైదరాబాద్ లో ల్యాండ్ అయిన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో జాయిన్ అయ్యేందుకు ప్రియాంక హైదరాబాద్ వచ్చిందని వార్తలు పెద్దెత్తున షికారు చేశాయి. కానీ ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియలేదు. కాగా హైదరాబాద్ కు వచ్చిన ప్రియాంక చిలుకూరు బాలాజీ ఆలయాన్ని సందర్శించారు. చిలుకూరు బాలాజీ టెంపుల్ ను దర్శించుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు ప్రియాంక చోప్రా.. అయితే తాజాగా ప్రియాంక చోప్రా కుంభమేళాలో పాల్గొన్న ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

ప్రియాంక చోప్రా తన  భర్త నిక్ జోనాస్,  కుమార్తె మాల్తీతో కలిసి మహా కుంభమేళాలో పాల్గొన్నట్టు లో ఫోటో వైరల్ అవ్వటంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ వార్త నిజం కాదు అని తెలుస్తుంది. ప్రియాంక ఫోటో కుంభమేళాలోనిది కాదని తెలుస్తుంది. ఆమె కుంభమేళలో పాల్గొనలేదు అని తెలుస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో కుటుంబ సమేతంగా అయోధ్యకు వచ్చి రామమందిరాన్ని సందర్శించినప్పుడు తీసిన ఫోటో. దీనిని కొందరు ఎడిట్ చేసి ప్రియాంక కుంభమేళాకు వచ్చినట్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

ప్రియాంక చోప్రా మాత్రమే కాదు బాలీవుడ్ సెలబ్రెటీల ఫోటోలు కూడా ఎడిట్ చేసి కుంభమేళాకు వారు వచ్చినట్టు సోషల్ మీడియాలో షేర్ చేశారు కొందరు. ఏఐ టెక్నాలజీతో ఈ ఫోటోలను ఎడిట్ చేశారు. ఇక ప్రియాంక ప్రస్తుతం అమెరికాలో సెటిల్ అయ్యింది. తన భర్తతో కలిసి అక్కడే ఉంటుంది. కాగా ఇప్పుడు మహేష్ బాబు రాజమౌళి సినిమాలో ఈ బ్యూటీ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యిందని అంటున్నారు. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.