అతిలోక సుందరి మైనపు విగ్రహావిష్కరణ ఈ రోజే

| Edited By:

Sep 04, 2019 | 2:49 AM

చూపు తిప్పుకోలేని అందం ఆమె సొంతం. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద అతిలోక సుందరిగా వెలిగిన అందాల రాశి శ్రీదేవి. ఆమె భౌతికంగా లేకపోయినా ఆమె అందం, అభినయం ఎవ్వరూ మర్చిపోలేనిది. అంతటి సౌందర్యవతికి అరుదైన గౌరవం దక్కింది. సింగపూర్‌లోని మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియంలో శ్రీదేవి మైనపు విగ్రహావిష్కరణ బుధవారం జరగునుంది. ఈ విషయాన్ని ఆమె భర్త బోనీకపూర్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన అతిలోక సుందరి […]

అతిలోక సుందరి మైనపు విగ్రహావిష్కరణ ఈ రోజే
Follow us on

చూపు తిప్పుకోలేని అందం ఆమె సొంతం. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద అతిలోక సుందరిగా వెలిగిన అందాల రాశి శ్రీదేవి. ఆమె భౌతికంగా లేకపోయినా ఆమె అందం, అభినయం ఎవ్వరూ మర్చిపోలేనిది. అంతటి సౌందర్యవతికి అరుదైన గౌరవం దక్కింది. సింగపూర్‌లోని మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియంలో శ్రీదేవి మైనపు విగ్రహావిష్కరణ బుధవారం జరగునుంది. ఈ విషయాన్ని ఆమె భర్త బోనీకపూర్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన అతిలోక సుందరి మైనపు విగ్రహాన్ని చూడాలని తాను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టుగా ట్వీట్ చేశారు.

శ్రీదేవి గత ఏడాది ఫిబ్రవరి 24న దుబాయ్‌లో బంధువుల వివాహవేడుకకు వెళ్లి తుదిశ్వాస విడిచారు. ఆమె సినిమాలకు దూరమైన చాలకాలం తర్వాత ఇంగ్లీష్ వింగ్లీష్ మూవీతో సెకెండ్ ఇన్సింగ్స్ మొదలు పెట్టారు. ఆ క్రమంలో శ్రీదేవి ఆఖరి చిత్రం ‘మామ్’. ఈ చిత్రానికి జాతీయ ఉత్తమ నటి అవార్డు కూడా వచ్చింది. అయితే అవార్డు వచ్చే సమయానికి శ్రీదేవి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది.