లాక్ డౌన్ పుణ్యమాని ఓటీటీ ప్లాట్ ఫామ్స్కు ప్రేక్షకాదరణ తెగ పెరిగిపోయింది. జనాలు ఇంట్లోనే ఉంటూ మూవీస్ ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా రిలీజ్ కానీ సినిమాల నిర్మాతలు కూడా ఓ నిర్ణయానికి వచ్చేవారు. ఫైనాన్సర్ల దగ్గర తెచ్చిన డబ్బుకు వడ్డీ పెరిగిపోతున్న నేపథ్యంలో..రీలజ్ కు సిద్దమైన సినిమాలను విడుదల చేయకుండా అలా వదిలేయడం కంటే ఓటీటీ ప్లాట్ ఫామ్స్లో నేరుగా రిలీజ్ చేయడం బెటర్ అనుకుంటున్నారు . థియేటర్ యాజమాన్యాలు అభ్యంతరాలు చెబుతున్నా.. పలువురు నిర్మాతలు ముఖ్యంగా చిన్న నిర్మాతలు అమేజాన్, , నెట్ ఫ్లిక్స్, జీ-5, సన్ నెక్స్ట్, ఆహా, హాట్ స్టార్ వంటి ఓటీటీ ప్లాట్ పామ్స్లో సినిమాల విడుదలకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మహానటి ఫేమ్ కీర్తి సురేశ్ నటించిన పెంగ్విన్ మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కాబోతుంది. వీటితో పాటు గులాబో సిటావో, పొన్ మగల్ వంధల్ (తమిళం), ఫ్రెంచ్ బిర్యానీ (కన్నడ), శకుంతలాదేవీ(హిందీ), సుఫియాం సుజాతాయం(మళయాళం), లక్ష్మీ బాంబ్ (హిందీ).. చిత్రాలు కూడా ఓటిటి రిలీజ్ లకు రెడీ అయ్యాయి.
ఇవి మాత్రమే కాదు.. ఓటిటి సంస్థలు రిలీజ్ కానీ మరికొన్ని సినిమాలను దక్కించుకునేందుకు పోటీ పడుతున్నాయి. కార్గిల్ గర్ల్, లూడో, జున్డ్ చిత్రాలు ప్రస్తుతం ఫస్ట్ కాపీ చేతిలో ఉన్న నేపథ్యంలో వీటికి త్వరలోనే ఓటీటీలలో మూహుర్తాలు కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందూ కి జవానీ, రూహిఅఫ్జానా , షిద్దాత్ మూవీస్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్నాయి. ఇవి కూడా ఓటీటీలో రిలీజ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.