రియ‌ల్ హీరో… ముజఫర్​పుర్​ బాలుడ్ని దత్తత తీసుకున్న షారుక్​

|

Jun 02, 2020 | 1:38 PM

తల్లి చనిపోయిందని తెలియక రైల్వేస్టేషన్‌లో ‘అమ్మా లే’ అంటూ నిద్రలేపేందుకు ప్రయత్నించిన ప‌సివాడి వీడియో ఇటీవ‌ల వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఆ వీడియో చూసిన బాలీవుడ్ హీరో షారుక్​ ఖాన్‌ చలించిపోయారు. ఆ వీడియో చూసి తన మనసును చెమ్మ‌గిల్లింద‌ని… అందుకే ఆ పిల్లాడిని దత్తత తీసుకుంటున్నట్లు తెలిపారు. “అనాథలుగా మారిన ఆ చిన్నారులు అన్ని బాధ్య‌త‌లు ఇక‌మీద‌ట‌ మీర్‌ ఫౌండేషన్‌ చూసుకుంటుంది. ప్రస్తుతం ఆ పిల్లలు వారి తాత సంరక్షణలో ఉన్నట్లు తెలిసింది. […]

రియ‌ల్ హీరో... ముజఫర్​పుర్​ బాలుడ్ని దత్తత తీసుకున్న షారుక్​
Follow us on

తల్లి చనిపోయిందని తెలియక రైల్వేస్టేషన్‌లో ‘అమ్మా లే’ అంటూ నిద్రలేపేందుకు ప్రయత్నించిన ప‌సివాడి వీడియో ఇటీవ‌ల వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఆ వీడియో చూసిన బాలీవుడ్ హీరో షారుక్​ ఖాన్‌ చలించిపోయారు. ఆ వీడియో చూసి తన మనసును చెమ్మ‌గిల్లింద‌ని… అందుకే ఆ పిల్లాడిని దత్తత తీసుకుంటున్నట్లు తెలిపారు.

“అనాథలుగా మారిన ఆ చిన్నారులు అన్ని బాధ్య‌త‌లు ఇక‌మీద‌ట‌ మీర్‌ ఫౌండేషన్‌ చూసుకుంటుంది. ప్రస్తుతం ఆ పిల్లలు వారి తాత సంరక్షణలో ఉన్నట్లు తెలిసింది. వారికి సాయం చేయడానికి మాకు స‌హ‌క‌రించిన‌ ప్రతి ఒక్కరికీ మీర్‌ ఫౌండేషన్‌ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నా​. నా చిన్నతనంలోనే నాన్న‌ను కోల్పోయాను. 30 సంవత్సరాల క్రితం అమ్మ కూడా చనిపోయింది. అమ్మా‌నాన్న‌లు లేని లోటు ఎలా ఉటుందో నాకు తెలుసు. వారితో ఎక్కువ‌ సమయం గడపలేకపోయాననే బాధ జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. అందుకే మేము మా పనుల్లో ఎంత బిజీగా ఉన్న పిల్లలతో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నిస్తున్నాం. వారికి సంబంధించిన అన్ని విష‌యాలు జాగ్ర‌త్త‌గా చూసుకుంటున్నాం. వారు ఎక్కడికైనా వెళ్లినా, మేము దూరంగా ఉన్నా ఎప్పటికప్పుడు ఫోన్‌లో సంభాషిస్తూనే ఉంటాం” అని షారుక్​ ఖాన్​ వెల్ల‌డించారు.