చిక్కుల్లో‘స‌డ‌క్ 2’… కేసు న‌మోదు

|

Jul 04, 2020 | 3:21 PM

ద‌ర్శ‌కుడు మ‌హేశ్ భ‌ట్‌..ప్రొడ్యూస‌ర్ ముఖేష్ భ‌ట్‌, క‌థానాయిక‌ ఆలియా భ‌ట్‌ల‌పై ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముజ‌ఫ‌ర్ న‌గ‌ర్ కోర్టులో కేసు న‌మోదైంది.

చిక్కుల్లో‘స‌డ‌క్ 2’... కేసు న‌మోదు
Follow us on

ద‌ర్శ‌కుడు మ‌హేశ్ భ‌ట్‌..ప్రొడ్యూస‌ర్ ముఖేష్ భ‌ట్‌, క‌థానాయిక‌ ఆలియా భ‌ట్‌ల‌పై ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముజ‌ఫ‌ర్ న‌గ‌ర్ కోర్టులో కేసు న‌మోదైంది. వీరి కాంబినేష‌న్‌లో ‘స‌డ‌క్‌2’ సినిమా తెరకెక్కుతోన్న‌ సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల ఈ చిత్ర‌ పోస్ట‌ర్‌ను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. ఈ క్ర‌మంలో ‘స‌డ‌క్ 2’ పోస్ట‌ర్ హిందూ ప్ర‌జ‌ల మ‌నోభావాలు దెబ్బ‌తినేలా ఉందంటూ… 120బీ, 295ఏ సెక్ష‌న్ల క్రింద ముఖేష్ భ‌ట్‌, మ‌హేశ్ భ‌ట్‌, ఆలియా భ‌ట్‌ల‌పై సోను కుమార్ అనే లాయ‌ర్ కేసు న‌మోదు చేశారు. 1991లో వ‌చ్చిన‌ ‘స‌డ‌క్’ చిత్రానికి సినిమాకు ఇది సీక్వెల్ గా వ‌స్తోంది. ఆలియాతో పాటు పూజాభ‌ట్‌, సంజ‌య్ ద‌త్ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.