Rashmika Mandanna : మరోసారి గీతగోవిందం కాంబినేషన్… క్లారిటీ ఇచ్చిన రష్మిక మందన..
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.. సిల్వర్ స్క్రీన్ మీద ఈ కాంబినేషన్ చూసి మైమరచిపోని వారుండరు. గీత గోవిందం సినిమాలో కలిసి నటించిన ఈ జంట
Rashmika Mandanna: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.. సిల్వర్ స్క్రీన్ మీద ఈ కాంబినేషన్ చూసి మైమరచిపోని వారుండరు. గీత గోవిందం సినిమాలో కలిసి నటించిన ఈ జంట ఆ సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్నారు. ఆతర్వాత ఈ ఇద్దరు కలిసి డియర్ కామ్రేడ్ అనే సినిమా చేశారు. డియర్ కామ్రేడ్ కూడా పాన్ ఇండియా లెవల్లో బజ్ క్రియేట్ చేసింది. రెండు సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ జంట.. ఇప్పుడు బయట కూడా ఎక్కువగా కలిసే కనిపిస్తున్నారు.
ఈ కాంబినేషన్లో హ్యాట్రిక్ సినిమా కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. అందుకే సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించిన రష్మిక తమ కాంబినేషన్లో నెక్ట్స్ మూవీ గురించి ఇంట్రస్టింగ్ కామెంట్ చేశారు. మళ్లీ కలిసి ఎప్పుడు నటించబోతున్నారో కూడా హింట్ ఇచ్చారు.
విజయ్తో కలిసి మరో సినిమా చేయాలని తనకు కూడా ఉందన్న రష్మిక.. మంచి కథ కోసం వెయిట్ చేస్తున్నామని చెప్పారు. మరి రష్మిక ఈ హింట్ ఇచ్చిన తరువాతైనా డైరెక్టర్స్ ఈ కాంబో రిపీట్ చేసే కథ రెడీ చేస్తామో చూడాలి. ఆల్రెడీ విజయ్. రష్మిక ఇద్దరు పాన్ ఇండియా ఎంట్రీకి రెడీ అవుతున్నారు కాబట్టి.. ఈ కాంబోలో హ్యాట్రిక్ సినిమా అంటే మార్కెట్ రేంజ్ కూడా మరో లెవల్లో ఉంటుంది. ఇక విజయ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే సినిమా చేస్తున్నాడు . ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అటు రష్మిక తెలుగు,తమిళ , హిందీ భాషలో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం తెలుగులో అల్లు అర్జున్ సరసన పుష్పలో నటిస్తుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :