Nayanthara: ప్రొడ్యూసర్లను భయపడుతున్న నయన్.. రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిన లేడీసుపర్ స్టార్..

సినిమా ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కుతున్నాయి. ఇక హీరో,  హీరోయిన్ల రెమ్యునరేషన్స్ కూడా భారీగా ఉంటున్నాయి.

Nayanthara: ప్రొడ్యూసర్లను భయపడుతున్న నయన్.. రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిన లేడీసుపర్ స్టార్..

Updated on: May 24, 2021 | 8:57 PM

Nayanthara:

సినిమా ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కుతున్నాయి. ఇక హీరో,  హీరోయిన్ల రెమ్యునరేషన్స్ కూడా భారీగా ఉంటున్నాయి. కొంతమంది హీరోయిన్లు హీరోలకు సరిసమానంగా పారితోషకాలు తీసుకుంటున్నారు. తాజాగా లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా భారీ రెమ్యునరేషన్ ను డిమాండ్ చేస్తుందంట. మాములుగా బాలీవుడ్ లో హీరోయిన్స్ దాదాపు 15 -20 అంటూ బేరాలాడుతూ ఉంటారు. అయితే బాలీవుడ్ ను మించిన పారితోషికం ను సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార అందుకునేందుకు ఆరాట పడుతోంది. నయనతార నటించిన ‘నేట్రికన్’ విడుదలకు సిద్దం అయ్యింది. ప్రముఖ ఓటీటీ ఈసినిమాను డైరెక్ట్ రిలీజ్ చేసేందుకు గాను దాదాపుగా రూ.20 కోట్ల కు గాను కొనుగోలు చేసిందట.    ప్రియుడు విఘ్నేష్ శివన్ తో కలిసి నయన్ స్వయంగా ఈ సినిమాను నిర్మించిన విషయం తెల్సిందే. 20 కోట్లు ఓటీటీ.. మరో 10 కోట్లు ఇతర రైట్స్ ద్వారా రాబోతున్నాయి.

దాంతో తన మార్కెట్ రూ.30 నుండి రూ.40 కోట్లకు పెరిగిన నేపథ్యంలో తన పారితోషికంను ఏకంగా రూ.10 కోట్లకు పెంచాలని నిర్ణయించుకుందట. నిన్న మొన్నటివరకు మూడు నుంచి నాలుగు కోట్ల వరకు ఉన్న రెమ్యునరేషన్ ను ఇప్పుడు నయన్ ఏకంగా 10 కోట్లు చేసింది. ఇక పై ఈ అమ్మడికి ఇంత మొత్తంలో ఇవ్వాలంటే నిర్మాతలకు కష్టమే అని చెప్పాలి. ప్రస్తుతం నయన్ తమిళ్ లో సినిమాలు చేస్తుంది. త్వరలోనే మరోసారి మెగాస్టార్ సినిమాలో నటించబోతుందని వార్తలు వస్తున్నాయి. లూసిఫర్ రీమేక్ లో నయనతారను నటింపజేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట.

మరిన్ని ఇక్కడ చదవండి  :

Priyanka Arul Mohan: అక్కినేని యంగ్ హీరో సరసన ఛాన్స్ కొట్టేసిన నాని హీరోయిన్.. ఏ సినిమాలో అంటే..

Most Eligible Bachelor: అఖిల్ కొత్త సినిమా ఓటీటీలో విడుద‌ల కానుందా.? క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్‌..

Shahrukh Khan: మ‌రో కొత్త అవతార‌మెత్తనున్న బాలీవుడ్ బ‌ద్‌షా..! ఓటీటీని ఒడిసిప‌ట్టుకుంట‌న్న షారుఖ్‌..

Loading...
Unable to load recommendations.
Follow Us