సత్కారాల కంటే అవమానాలే ఎక్కువ జరిగాయి.. కన్నీళ్లు పెట్టించిన ఎంఎస్ నారాయణ..

వెండితెరపై తమ నటనతోపాటు కామెడీ టైమింగ్ తో అడియన్స్ హృదయాల్లో చెరగని ముద్ర వేశారు ఎంఎస్ నారాయణ. వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించిన ఆయన మరణం సినీరంగానికి తీరని లోటు. లెక్చరర్ జాబ్ వదిలేసి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ ఆయన జీవితంలో సత్కారాల కంటే ఎక్కువగా అవమానాలే ఉన్నాయంటూ గతంలో వెల్లడించారు.

సత్కారాల కంటే అవమానాలే ఎక్కువ జరిగాయి.. కన్నీళ్లు పెట్టించిన ఎంఎస్ నారాయణ..
Ms Narayana

Updated on: Jan 14, 2026 | 7:05 PM

దివంగత కమెడియన్ ఎంఎస్ నారాయణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. కానీ ఆకస్మాత్తుగా ఈ లోకం వదిలివెళ్లిపోతూ సినీరంగానికి ఊహించని విషాదాన్ని మిగిల్చారు. ఎంఎస్ నారాయణ గతంలో చేసిన కామెంట్స్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తన జీవితంలోని సవాళ్లను, అవమానాలను పంచుకున్నారు. లెక్చరర్ నుండి నటుడిగా మారడానికి పడిన కష్టం, కుటుంబ సహకారం, రైలు ప్రయాణాల్లో ఎదురైన విచిత్ర సంఘటనలు, సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేయడానికి చేసిన కృషిని ఆయన వివరించారు. కష్టాలను అధిగమించి విజయం సాధించిన తన ప్రయాణాన్ని ఆయన వెల్లడించారు.

సినీరంగంలో మా నాన్నకు పెళ్లి, దుబాయ్ శీను, కళ్యాణ రాముడు, సీమ శాస్త్రి వంటి చిత్రాలు తనకు మంచి పేరు తెచ్చాయని చెప్పారు. తన భార్య ప్రోత్సాహంతోనే సినీ రంగంలో కొనసాగగలిగానని, “ప్రయత్నిస్తూ మరణిస్తే గెలిచినట్టే, ప్రయత్నం విరమిస్తే మరణించినట్లే” అనే సిద్ధాంతాన్ని తాను నమ్ముతానని తెలిపారు. జీవితంలోని కష్టాలు తనలోని హాస్య కళాకారుడిని తీర్చిదిద్దాయని ఎంఎస్ నారాయణ పేర్కొన్నారు. సత్కారాల కంటే అవమానాలే ఎక్కువగా ఎదుర్కొన్నానని అన్నారు. తన చివరి చెల్లి మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని, ఆమె బ్రతికి ఉంటే ఇంకా ఎంతో సహాయం చేసేవాడినని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న జీతంతో టీచర్‌గా పని చేస్తున్న రోజుల్లో పడిన కష్టాలు, తన భార్యతో కలిసి ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులను గుర్తుచేసుకున్నారు.

లెక్చరర్‌గా స్థిరమైన ఉద్యోగం వదులుకొని సినిమా రంగంలోకి ప్రవేశించడం తన జీవితంలో చేసిన గొప్ప సాహసంగా ఎంఎస్ నారాయణ అభివర్ణించారు. ఈ ప్రయాణంలో తన భార్య అండదండలు ఎంతో కీలకమని, ఆమె ప్రోత్సాహం లేకుంటే తాను సక్సెస్ అయ్యేవాడిని కాదని పేర్కొన్నారు. “ప్రయత్నిస్తూ మరణిస్తే గెలిచినట్టే, ప్రయత్నం విరమిస్తే మరణించినట్లే” అనే తన జీవిత సిద్ధాంతాన్ని పంచుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ అంటే తనకు చాలా ఇష్టమని, చిరంజీవి తనతో చాలా సన్నిహితంగా ఉండేవారని, తన కుమారుడి పుట్టినరోజుకు చిరంజీవి ఇంటికి వెళ్లినప్పుడు ఆయన స్వయంగా తమ ఫోటో తీయించి పంపించారని తెలిపారు. జీవితంలోని కష్టాలు, సవాళ్లు, అవమానాలే తనను ఒక గొప్ప కళాకారుడిగా తీర్చిదిద్దాయని ఎంఎస్ నారాయణ స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి : Anshu Ambani : ఏంటీ.. మన్మథుడు హీరోయిన్‏కు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయిందిగా..

Loading...
Unable to load recommendations.
Follow Us