
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. కేజీఎఫ్ సినిమాలతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హోంబలే నిర్మాణ సంస్థే ఈ సినిమాను కూడా భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఎన్టీఆర్ కూడా ఈ సినిమా షూటింగులో బిజీ బిజీగా ఉంటున్నాడు. అయితే ఎన్టీఆర్ లేటెస్ట్ గా దండోరా సినిమాను చూశారు. ఇటీవలే ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ చాలా అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు కురిపించారు.ఈ మేరకు ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఓ పోస్ట్ షేర్ చేశాడు.
‘ఇప్పుడే దండోరా సినిమా చూశాను. నన్ను చాలా ఆలోచించేలా చేసింది. శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, బిందు మాధవి అద్భుతంగా నటించారు. ఇంత బలమైన కథను అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు మురళీ కాంత్కు నా ప్రత్యేక అభినందనలు.అలాగే ఈ మంచి ఈ ప్రయత్నానికి మద్దతు ఇచ్చినందుకు రవీంద్ర బెనర్జీకి నా అభినందనలు. ఇంతటి అద్భుతమైన చిత్రానికి మద్దతు ఇచ్చి.. ఈ మూవీలో భాగమైనందుకు తారాగణం, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను’ అని ట్విట్టర్ (ఎక్స్) లో రాసుకొచ్చారు ఎన్టీఆర్. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
Just watched #Dhandoraa. Deeply thought-provoking and powerful. Outstanding performances by Sivaji garu, Navdeep, Nandu, Ravi Krishna and Bindu Madhavi throughout…
Hats off to director Murali Kanth garu for the strong writing and for executing such a rooted story so well.…
— Jr NTR (@tarak9999) January 19, 2026
#Dhandoraa Trending at No.2 in India on #Prime #DhandoraaOnPrime #Sivaji@ActorSivaji pic.twitter.com/RjFYszKeTI
— FilmyFella (@FilmyFella) January 19, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..