
పల్లవి ప్రశాంత్ ఈ సీజన్లో అనూహ్యంగా దూసుకుపోతున్న రైతు బిడ్డ.. బిగ్ బాస్కి వెళ్లేందుకు మినీ యుద్దమే చేసిన అతడు.. లోపలకి వెళ్లాక చెలరేగిపోతున్నాడు. తొలుత రతిక మాయలో పడినప్పటికీ.. గురువు శివాజీ సూచనలతో త్వరగానే ఆ మాయ నుంచి బయటపడ్డాడు. ఆ తర్వాత అతనికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఏ టాస్క్ ఇచ్చినా సరే చీల్చి చెండాటమే పనిగా పెట్టుకున్నాడు. శివాజీ సలహాలతో టాప్ కంటెస్టెంట్గా రాటు దేలాడు. అసమాన ఆటతీరు ప్రదర్శిస్తూ బిగ్ బాస్ సీజన్ 7 తొలి కెప్టెన్ అయ్యాడు. హౌస్లో చాలామంది రైతు బిడ్డను తక్కువ చేసి చూసేశారు. ముఖ్యంగా ఆ సీరియల్ బ్యాచ్ చేసిన అతి అంతా ఇంతా కాదు. ఒక రకంగా చెప్పాలంటే వారి మాటలే అతడిని హీరోని చేశాయి. రెండు ముఖాలు.. రెండు ముఖాలు అన్నవారు ఇప్పుడు ముఖం ఎక్కడ పెట్టుకోవాలనే తెలియని పరిస్థితి. నామినేషన్స్లో ఉంటే చాలు ప్రశాంత్కు ఓట్లు గుద్దేస్తున్నారు జనాలు.
అయితే కొంతమంది బయట ప్రశాంత్కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. వాళ్లకి చాలా పొలం ఉందని.. కోటీశ్వర్లు అని వార్తలు సర్కులేట్ చేస్తున్నారు. అయితే ఈ ప్రచారాన్ని తప్పు పట్టారు పల్లవి ప్రశాంత్ పేరెంట్స్. తమకి కేవలం 6 ఎకరాలు పొలం మాత్రమే ఉందని వెల్లడించారు. నాలుగు కార్లు ఉన్నాయి అంటున్నారని.. తమకు ఒక కారు కూడా లేదన్నారు. పొలం దున్నుకునేందుకు ఓ ట్రాక్టర్ మాత్రం ఉందని చెప్పుకొచ్చారు. కొంతమంది కావాలనే తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని పల్లవి ప్రశాంత్ పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు.
తమ బిడ్డ బిగ్ బాస్లో వచ్చిన డబ్బు.. పేద రైతులకు ఇస్తాననడం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. అమర్ దీప్ తమ బిడ్డను తిట్టడం మాత్రం తమ మనసును కలిచివేసిందని పల్లవి ప్రశాంత్ పేరెంట్స్ తెలిపారు. 13 ఏళ్ల నుంచి ప్రశాంత్ వ్యవసాయ పనులు చేసేవాడని.. కొందరు ఫ్రెండ్స్ అతడిని మోసం చేశారని వెల్లడించారు. బిగ్ బాస్ ఇంట్లో హీరో శివాజీ తమ బిడ్డను కాపాడుకుంటూ వస్తున్నాడని.. వారు తెలిపారు. తమను తమ బిడ్డ ఎప్పుడూ బాధ పెట్టలేదని.. వెల్లడించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..