Bimbisara: కెరీర్ బిగినింగ్ నుంచి వైవిధ్యమైన చిత్రాల్లోనటిస్తూ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని సంపాదించుకున్నారు హీరో నందమూరి కళ్యాణ్ రామ్. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా ఈ యాక్షన్ హీరో హిస్టారికల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కళ్యాణ్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బింబిసార’. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ.కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్’ ట్యాగ్ లైన్. వశిష్ఠ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా ట్రైలర్ను రీసెంట్గా విడుదల చేయగా విశేషమైన స్పందన లభించింది. బుధవారం ఈ మూవీ నుంచి మొదటి పాటను విడుదల చేశారు.
‘భువి పై ఎవడూ కనివిని ఎరుగని అద్భుతమే జరిగినే.. దివిలో సైతం కథగా రాని విధి లీలే వెలిగినే..’ అంటూ సాగిన ఈ పాట శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది. కాల భైరవ ఇంటెన్స్ వాయిస్ తో అద్భుతంగా ఆలపించారు. లిరిసిస్ట్ శ్రీమణి అర్థవంతమైన సాహిత్యం అందించారు. ఈ సాంగ్ లాంచ్ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. మా ట్రైలర్కు విశేషమైన స్పందన ఇచ్చిన ఆడియెన్స్కు థ్యాంక్స్. ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చిన చిరంతన్ గారి, అద్బుతమైన సాహిత్యం ఇచ్చిన శ్రీమణి గారికి, పాడిన కాళ భైరవకు థ్యాంక్స్. ఈ పాట మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. మా బింబిసారుడి త్రిగర్తల రాజ్యం నుంచి మొదటి పాట. ఇలాంటివి ఇంకా వస్తాయి. కర్మ సిద్దాంతాన్ని ఆధారంగా ఈ పాట నేపథ్యాన్ని తీసుకున్నాం. బింబిసారుడు చేసే యుద్దం ఎలా ఉంటుందో ఆగస్ట్ 5న చూస్తారు’ అని అన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి