
సినీ సెలబ్రెటీల లైఫ్ లో ఏం జరిగిన అది పెద్ద న్యూసే.. వార్తల్లో, సోషల్ మీడియాలో అది విపరీతంగా వైరల్ అవుతుంది. ఇక హీరోయిన్స్ పెళ్లి వార్తలైతే మూడు, నాలుగు రోజుల వరకు నెట్టింట మోతమోగిపోతుంది. కాగా ఇండస్ట్రీలో హీరోయిన్స్ చాలా మంది వ్యవరవేత్తలను పెళ్లిళ్లు చేసుకున్నారు. మరికొంతమంది హీరోలను, నిర్మాతలను పెళ్లి చేసుకున్న వారు ఉన్నారు. చాలా తక్కువ మంది మాత్రమే రాజకీయనాయకులను వివాహం చేసుకున్నారు. అలాగే ఓ టాలీవుడ్ హీరోయిన్ కూడా ఓ రాజకీయ నాయకుడిని వివాహం చేసుకుంది. ఆయన ఎదో చిన్నా చితక రాజకీయనాయకుడు కాదు.. సొంత పార్టీ పెట్టి.. ముఖ్యమంత్రిగా చేసి ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. అందం అభినయంతో కట్టిపడేసిన ఆమె ఇప్పుడు నటనకు దూరంగా ఉంటుంది. ఇంతకూ ఆ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా.?
కుమార స్వామి భార్య పేరు రాధిక కుమారస్వామి. పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన రాధికా .. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కన్నడ చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా రాణించింది ఈ అమ్మడు. 2000 ఏడాదిలో ప్రముఖ నటిగా గుర్తింపు తెచ్చుకుంది.ఇక రాధికా చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చింది. తొలి సినిమా చేసే సమయంలో ఆమె 9వ తరగతి చదువుతుంది. కన్నడ బాషాలో వరుసగా సినిమాలు చేసిన ఆమె తమిళ్ లోనూ సినిమాలు చేసింది. యార్కాయి అనే సినిమాతో తమిళ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక తెలుగులో దివంగత నటుడు తారకరత్న నటించిన భద్రాద్రి రాముడు సినిమాలో నటించింది.
2004లో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాలో రాధికా రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించింది. ఆతర్వాత అవతారం అనే సినిమాలో నటించింది. ఆతర్వాత ఆమె తెలుగులో సినిమాలు చేయలేదు. 2018 వరకు సినిమాలు చేసిన ఆమె ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. అలాగే రాధికా రెండు సినిమాలను నిర్మించింది కూడా.. కాగా కర్ణాటక మంత్రి హరదనహళ్ళి దేవగౌడ కుమారస్వామిని వివాహం చేసుకుంది రాధికా. కన్నడ రాజకీయాల్లో ఆయన తెలియని వారు ఉండరు. అప్పటికే ఆయనకు అనిత కుమారస్వామితో వివాహం అయ్యింది. అటు రాధికాకు కూడా అది రెండో వివాహమే.. అంతకు ముందు ఆమె రతన్ కుమార్ ను వివాహం చేసుకుంది రాధికా. పెళ్లి సమయానికి రాధికా వయసు 20ఏళ్లు, అలాగే కుమారస్మామి వయసు 47 ఏళ్లు. ఇద్దరి మధ్య 27ఏళ్ల తేడా ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.