25 సినిమాలు చేస్తే 3 హిట్లు, 2 యావరేజ్.. అయినా క్రేజ్ తగ్గని టాలీవుడ్ హీరో..

టాలీవుడ్ లో చాలా మంది యంగ్ హీరోలు వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. కొత్త కొత్త కథలు ఎంచుకుంటూ సినిమాలు చేసి మెప్పిస్తున్నారు. అలాగే కొంతమంది హీరోలు మాత్రం కొన్ని సినిమాలతోనే పాపులర్ అవుతున్నారు. కొందరు మాత్రం హిట్స్ కోసం సతమతం అవుతున్నారు.

25 సినిమాలు చేస్తే 3 హిట్లు, 2 యావరేజ్.. అయినా క్రేజ్ తగ్గని టాలీవుడ్ హీరో..
Tollywood

Updated on: Jan 16, 2026 | 11:06 AM

టాలీవుడ్ లో చాలా మంది కుర్ర హీరోలు సత్తా చాటుతున్నారు. కొత్త కొత్త సినిమాలతో, కథలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకుంటూ మంచి విజయాలను అందుకుంటున్నారు. అయితే ఓ హీరో మాత్రం సక్సెస్ కోసం చాలా కాలం ఎదురుచూశాడు. వరుసగా సినిమాలు చేసినా అవి ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 25 సినిమాలు చేశాడు ఈ యంగ్ హీరో కానీ అందులో మూడు సినిమాలు మాత్రమే విజయం సాధించాయి. రెండు సినిమాలు యావరేజ్ గా నిలిచాయి. దాదాపు 13ఏళ్ల తర్వాత ఇటీవలే హిట్ అందుకున్నాడు. ఇంతకూ ఆ యంగ్ హీరో ఎవరో తెలుసా.?

ప్రేమకావాలి సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు ఆది సాయి కుమార్. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నడు. ప్రేమకావాలి సినిమా హిట్ తర్వాత వంటనే లవ్లీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. వరుసగా రెండు విజయాలను అందుకొని ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాడు ఆది సాయి కుమార్. కానీ ఆతర్వాత ఆది నటించిన సినిమాలు ప్రేక్షకులను నిరాశపరిచాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసినప్పటికీ అవి బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి.

అయినా కూడా ఆది వెనకడుగు వేయకుండా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. చూస్తూ చూస్తూనే  24 సినిమాలు పూర్తి చేశాడు. ఈ క్రమంలోనే ఇటీవలే తన 25వ సినిమా శంబాలా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శంబాలా సినిమా మంచి విజయాన్ని అందుకుంది. మైథలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో చాలాకాలం తర్వాత హిట్ రుచి చూశాడు ఆది సాయి కుమార్. ఈ చిత్రానికి యుగంధర్ ముని దర్శకత్వం వహించారు. అలాగే ఇందులో అర్చన అయ్యర్ కథానాయికగా నటించింది. త్వరలోనే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఆహాలో ఈ సినిమా ఈనెల 22 నుంచి అందుబాటులోకి రానుంది.

Aadi Sai Kumar

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..