అమితాబ్‌కు క‌రోనా…త‌న మార్క్ ట్వీట్ వేసిన వ‌ర్మ‌..

|

Jul 12, 2020 | 5:29 PM

వ‌ర్మ అంటేనే సంచ‌ల‌నం. ఆయ‌న ఏదీ ఏది చేసినా నార్మ‌ల్ గా ఉండ‌దు. మీడియా, సోష‌ల్ మీడియా అటెన్ష‌న్ గ్రాబ్ చేయాల్సిందే. తాజాగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీకి క‌రోనా సోకింద‌నే వార్త మూవీ ప్ర‌పంచాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే.

అమితాబ్‌కు క‌రోనా...త‌న మార్క్ ట్వీట్ వేసిన వ‌ర్మ‌..
Follow us on

వ‌ర్మ అంటేనే సంచ‌ల‌నం. ఆయ‌న ఏదీ ఏది చేసినా నార్మ‌ల్ గా ఉండ‌దు. మీడియా, సోష‌ల్ మీడియా అటెన్ష‌న్ గ్రాబ్ చేయాల్సిందే. తాజాగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీకి క‌రోనా సోకింద‌నే వార్త మూవీ ప్ర‌పంచాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. అమితాబ్ తో పాటు ఆయ‌న కుమారుడు అభిషేక్, కోడ‌లు ఐశ్వ‌ర్య‌, మ‌న‌వ‌రాలు ఆరాధ్య‌ల‌కు క‌రోనా సోకింది. దీంతో వారు ప్ర‌స్తుతం చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో అమితాబ్ కుటుంబం నివ‌శిస్తోన్న ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్ర‌క‌టించారు అధికారులు. కాగా అమితాబ్ కు క‌రోనా సోక‌డంతో..ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాలని సెల‌బ్రిటీలు అంద‌రూ ట్వీట్స్ వేస్తున్నారు. ఇక్క‌డే సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు వ‌ర్మ త‌న మార్క్ చాటుకున్నారు.

‘సర్కార్.. కరోనా బ్యాక్ మీద తన్ని ఎప్పటిలాగే మీరు ఇంకా ఆరోగ్యంగా తిరిగి వస్తారని నాకు తెలుసు. అందుకే మీ కోసం ప్రార్థించ‌ను. కానీ నేను కరోనా కోసం ప్రార్థిస్తాను. ఎందుకంటే.. మిమ్మల్ని ఇలా చేసినందుకు అతి ప‌క్కాగా చచ్చిపోతుంది’ అని వర్మ తన స్టైల్లో అమితాబ్ గురించి రాసుకొచ్చాడు.