విజేతగా చెప్తున్నా!.. జెన్యూన్‌ సెలక్షన్ – కౌశల్ మంద

| Edited By: Anil kumar poka

Jul 18, 2019 | 3:27 PM

హైదరాబాద్‌: సెలబ్రిటీ రియాల్టీ షో బిగ్‌బాస్‌పై వస్తున్న కాస్టింగ్ కౌచ్ తదితర ఆరోపణలపై ఆ షో సీజన్‌ 2 విజేత, నటుడు కౌశల్‌ మంద స్పందించారు. ఈ కార్యక్రమం అనైతికంగా ఉందని అడ్డుకోవాలని కోరుతూ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు చేయగా… మరోవైపు ఈ కార్యక్రమ నిర్వాహకుడు అభిషేక్‌ ముఖర్జీపై సినీ నటి గాయత్రి గుప్తా, జర్నలిస్ట్ శ్వేతా రెడ్డి బిగ్ బాస్ నిర్వాహకులపై వేరువేరు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో కౌశల్‌ […]

విజేతగా చెప్తున్నా!.. జెన్యూన్‌ సెలక్షన్ - కౌశల్ మంద
Follow us on

హైదరాబాద్‌: సెలబ్రిటీ రియాల్టీ షో బిగ్‌బాస్‌పై వస్తున్న కాస్టింగ్ కౌచ్ తదితర ఆరోపణలపై ఆ షో సీజన్‌ 2 విజేత, నటుడు కౌశల్‌ మంద స్పందించారు. ఈ కార్యక్రమం అనైతికంగా ఉందని అడ్డుకోవాలని కోరుతూ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు చేయగా… మరోవైపు ఈ కార్యక్రమ నిర్వాహకుడు అభిషేక్‌ ముఖర్జీపై సినీ నటి గాయత్రి గుప్తా, జర్నలిస్ట్ శ్వేతా రెడ్డి బిగ్ బాస్ నిర్వాహకులపై వేరువేరు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో కౌశల్‌ బిగ్‌బాస్‌ గురించి ట్విటర్‌ వేదికగా స్పందించారు.

‘బిగ్‌బాస్‌ 2 విజేతగా, ఓ సామాన్య పౌరుడిగా నాకు ఈ కార్యక్రమంపై ఎంతో గౌరవం ఉంది. ఈ కార్యక్రమం, ఎంపిక చేసే ప్రక్రియ ఎంతో నిజాయతీగా ఉంటాయని నాకు తెలుసు. బిగ్‌బాస్‌ మూడో సీజన్‌లో పాల్గొనబోయే వారందరికీ ఆల్‌ ది బెస్ట్‌. ఒక్కటి గుర్తుపెట్టుకోండి.. మీరు రైడ్‌ ఎక్కబోతున్నారు’ అని పేర్కొన్నారు. మూడో సీజన్‌కు అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్నారు.