AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 8: మరోసారి హౌస్‌లో నయని కన్నీటీ రాగం.. కౌంటర్లు వేసిన రోహిణి

హౌస్ లో ఉన్న వారిని నాలుగు టీమ్ లు గా చేసి.. ఒకొక్క టీమ్ లో ముగ్గురు సభ్యులు ఉండేలా చేశాడు. బ్లూ, రెడ్, ఎల్లో అలాగే గ్రీన్ టీమ్స్ చేశాడు బిగ్ బాస్. టీమ్ రెడ్: గౌతమ్, ప్రేరణ యష్మీ.. టీమ్ బ్లూ: అవినాష్ నిఖిల్ హరితేజ.. టీమ్ గ్రీన్: తేజ, విష్ణుప్రియ, నబీల్.. టీమ్ ఎల్లో: రోహిణి, పృథ్వీ, నయని.. ఉన్నారు.

Bigg Boss 8: మరోసారి హౌస్‌లో నయని కన్నీటీ రాగం.. కౌంటర్లు వేసిన రోహిణి
Bigg Boss 8
Rajeev Rayala
|

Updated on: Oct 31, 2024 | 7:29 AM

Share

నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లు కంటిన్యూ అయ్యాయి. బీబీ ఇంటికి దారేది లో భాగంగా నిన్న కూడా హౌస్ మేట్స్ కు కొన్ని టాస్క్ లు ఇచ్చాడు బిగ్ బాస్. అంతకు ముందు ఎపిసోడ్ లో హౌస్ లో ఉన్న వారిని నాలుగు టీమ్ లు గా చేసి.. ఒకొక్క టీమ్ లో ముగ్గురు సభ్యులు ఉండేలా చేశాడు. బ్లూ, రెడ్, ఎల్లో అలాగే గ్రీన్ టీమ్స్ చేశాడు బిగ్ బాస్. టీమ్ రెడ్: గౌతమ్, ప్రేరణ యష్మీ.. టీమ్ బ్లూ: అవినాష్ నిఖిల్ హరితేజ.. టీమ్ గ్రీన్: తేజ, విష్ణుప్రియ, నబీల్.. టీమ్ ఎల్లో: రోహిణి, పృథ్వీ, నయని.. ఉన్నారు. అలాగే గంగవ్వను అందరూ డిసైడ్ అయ్యి ఒకళ్ల టీమ్ లోకి తీసుకోవాలని చెప్పాడు బిగ్ బాస్. అలాగే మంచు మనిషి, పానిపట్టు యుద్దం అనే గేమ్స్ పెట్టాడు.

ఇక నిన్నటి ఎపిసోడ్ లో స్లీపింగ్ రేస్ అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో భాగంగా ప్రతి టీమ్ నుంచి ఇద్దరూ సభ్యులు వచ్చి.. ఒకరి తర్వాత ఒకరు. నెల పై ఉన్న మాట్రిస్ ని పరిగెత్తుకుంటూ వచ్చి దాని పైకి దూకి ముందుకు నెట్టాలి అలా ఎవరైతే ముందుగా ఆ మాట్రిస్ ను లైన్ దాటిస్తారో వాళ్లు విన్ అయినట్టు అని చెప్పాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో అందరూ కష్టపడి ఆడారు.

అయితే బ్లూ టీమ్ లో ఉన్న అవినాష్, నిఖిల్ ఈ గేమ్ లో విన్ అయ్యారు. అయితే ఎల్లో టీమ్ నుంచి ఈ గేమ్ ఆడటానికి నయని, అలాగే పృథ్వీ వచ్చారు. అయితే నయని గేమ్ గురించి రోహిణి మాట్లాడింది. దాంతో ఈ ఇద్దరి మధ్య విబేధాలు వచ్చాయి. రోహిణి తనకు చెప్పడం, చెప్పే విధానం తనకు నచ్చలేదు అంటూ నయని సీన్ క్రియేట్ చేసింది. అసలే హౌస్ లో క్రై బేబీ గా పేరు తెచ్చుకున్న ఈ చిన్నది మరోసారి ఏడుపు మొదలు పెట్టింది. అసలు ఏడవడానికి ఈమెను హౌస్ లోకి తీసుకున్నారా అని ప్రేక్షకులు ఫీల్ అయ్యేలా చేస్తుంది నయని.. ఆమె హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి ఏడుస్తూనే ఉంది. ప్రతి చిన్నదానికి కన్నీళ్లు పెట్టుకుంటుంది. అది ఆమె గేమ్ స్ట్రాటజీనో లేక నిజంగానే ఆమె ఏడుస్తుందో ప్రేక్షకులకు అర్ధంకాక తలలు పట్టుకుంటున్నారు. ఇక గేమ్ తర్వాత నా టీం మేట్ అలా ఎలా అంటుంది.. నా వల్లే టీం ఓడిపోయిందని ఎలా అంటుంది అంటూ నయని ఏడుపు మొదలు పెట్టింది. రోహిణి మొదట ఆమెకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది కానీ ఆమె వినకపోయే సరికే.. నీ ఏడుపు నువ్వు ఏడువు అన్నట్టు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. బయటకు వెళ్లిన తర్వాత రోహిణి నయానికి కౌంటర్లు వేసింది. ప్రతిదానికి ఫీల్ అయితే మనం ఏం చేయలేం.. ఇప్పుడు ఆమె దీన్ని కూడా పెద్ద సీన్ చేస్తుంది చూడు, ఇప్పుడు ఆమెను హరితేజ, పృథ్వీలు వెళ్లి మాట్లాడి తీసుకురావాలి ఆ పిల్లని.. అంటూ కౌంటర్లు వేసింది రోహిణి. ఆమె చెప్పినట్టే హరితేజ , పృథ్వీ వెళ్లి నయనిని ఓదార్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.