టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ దాదాపు అన్ని జానర్స్ టచ్ చేశారు. తండ్రి ఎన్టీఆర్ లా పౌరాణికం, జానపదం, సాంఘీకం ఇలా అన్నిజానర్స్ సినిమాలలో నటించాలని ఆయన ఆశపడుతూ ఉంటారు. అందుకు తగ్గట్లుగానే ‘భైరవ ద్వీపం’, ‘ఆదిత్య 369’, ‘గౌతమి పుత్ర శాతకర్ణి లాంటి సినిమాలు చేశారు. ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్నారు. అయితే ఆయన తన తదుపరి సినిమాలో రైతు పాత్ర పోషించనున్నారని సమాచారం.
ఈ ప్రాజెక్టుకు బి.గోపాల్ డైరెక్ట్ చేయనున్నారు. ఇంతకుముందు బి.గోపాల్- బాలయ్య కాంబోలో.. ‘సమరసింహారెడ్డి’, ‘నరసింహానాయుడు’ లాంటి బ్లాక్ బాస్టర్ సినిమాలు చేశారు. ఇప్పుడు కొత్త మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ను కంప్లీట్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.’గౌతమిపుత్ర శాతకర్ణి’కి అద్భతమైన సంభాషణలు రాసిన బుర్రా సాయిమాధవ్.. ఈ సినిమాకు పని చేయనున్నారని సమాచారం. అయితే ఇందులోని నటీనటులు, సాంకేతివర్గం గురించి క్లారిటీ రావాల్సి ఉంది.