పెళ్ళి వార్త‌ల‌పై క్లారిటీ ఇచ్చిన మాధ‌వీ ల‌త‌..

|

Jun 06, 2020 | 11:35 AM

ర‌విబాబు తీసిన 'నచ్చావులే' సినిమాతో తెలుగు తెర‌కి గ్రాండ్ గా ప‌రిచ‌య‌మైంది న‌టి‌ మాధవీలత. ఆ త‌ర్వాత కాలంలో మహేష్ బాబు ‘అతిథి’ సినిమాతో పాటు నాని హీరోగా వచ్చిన 'స్నేహితుడా' చిత్రాల‌లో త‌న న‌టన‌తో ఆక‌ట్టుకుంది.

పెళ్ళి వార్త‌ల‌పై క్లారిటీ ఇచ్చిన మాధ‌వీ ల‌త‌..
Follow us on

ర‌విబాబు తీసిన ‘నచ్చావులే’ సినిమాతో తెలుగు తెర‌కి గ్రాండ్ గా ప‌రిచ‌య‌మైంది న‌టి‌ మాధవీలత. ఆ త‌ర్వాత కాలంలో మహేష్ బాబు ‘అతిథి’ సినిమాతో పాటు నాని హీరోగా వచ్చిన ‘స్నేహితుడా’ చిత్రాల‌లో త‌న న‌టన‌తో ఆక‌ట్టుకుంది. ఇటీవ‌లి కాలంలో ఆమె సినిమాల‌కు దూర‌మై.. రాజ‌కీయాల‌కు ద‌గ్గ‌రైంది. ఇక ఆమె సోష‌ల్ మీడియాలో పెట్టే పోస్టులు ఎప్పుడూ వైర‌ల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఆమె .. ‘చాలా నెలల తరవాత నేను హ్యాపీగా ఉన్నాను. కొత్త లైఫ్ ఫ్రారంభ‌మైంది. అద్భుతం జ‌రిగింది. త్వరలోనే అనౌన్సిమెంట్ చేస్తాను’’ అంటూ పెట్టిన ఫేస్ బుక్ పోస్ట్‌ సంచలనంగా మారింది.

దీంతో స‌ద‌రు పోస్టుపై సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్ల మ‌ధ్య‌ ఆస‌క్తిక‌ర చ‌ర్చ మొద‌లైంది. ఈ భామ త్వ‌ర‌లో మ్యారేజ్ చేసుకోబోతుంద‌ని ప్ర‌చారం చేశారు. మాధ‌వీల‌త ఫ్రెండ్స్, వెల్ విష‌ర్స్ ఆమెకి అడ్వాన్స్ విషెస్ కూడా తెలియ‌జేశారు. వీటితో వేగ‌లేక‌పోయిన మాధవీలత త‌న పోస్టుపై క్లారిటీ ఇచ్చేసింది. ఇందులో ఏ మాత్రం నిజం లేదు. నా మ్యారేజ్ ఇప్ప‌ట్లో ఉండ‌దు. అందరు విషెస్ చెబుతుంటే న‌వ్వు వ‌స్తుంది. ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు. అన్నీ కుదిరితే 2021లో మ్యారేజ్ చేసుకుంటాన‌ని చెప్పింది మాధ‌వీల‌త‌.