ఇక తప్పదు ప్రొడ్యూసర్లను, సినిమా కార్మికులను నిలబెట్టాలంటే షూటింగులు చేయక తప్పదు. అందుకే టాలీవుడ్ స్టార్ హీరోలు సెట్స్ వైైపు అడుగులు వేస్తున్నారు. నాగ్ ఇప్పటికే మూవీతో పాటు బిగ్ బాస్ షూటింగ్ కూడా ప్రారంభించాడు. మహేశ్ కూడా యాడ్ ఫిల్మ్ షూటింగ్ లో పాల్గొన్నాడు. నాగచైతన్య కూడా `లవ్స్టోరీ` షూటింగ్ కూడా షురూ చేశాడు. ఈ నేపథ్యంలో `ఆచార్య` సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం.
త్వరలోనే `ఆచార్య` షూటింగ్ను రీ స్టార్ట్ చేయబోతున్నారట. అయితే షూటింగ్ మొదలైనా.. చిరంజీవి మాత్రం సెట్స్ పైకి రారని తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్చరణ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందుగా చెర్రీ సీన్లను షూట్ చేస్తారట. కేవలం 30 శాతం మంది సిబ్బందితో మాత్రమే చిత్రీకరణ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో చెర్రీ సరసన నటించబోయే హీరోయిన్ను ఇంకా ఫైనల్ చేయలేదు. ఈ నెలలోనే హీరోయిన్ను ఖరారు చేసి షూటింగ్ ప్రారంభించాలనుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల టాక్.