లాక్డౌన్ సమయంలో కష్టాల్లో ఉన్నవారికి సహయం చేసిన రియల్ హీరో సోనూసూద్కు ఎక్కడికక్కడ అభిమానులు ఆలయాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తమకు సాయం చేసిన దేవుడిలా సోనూసూద్ను ఆరాదిస్తున్నారు. తాజాగా తెలంగాణలో ఓ అభిమాని సోనూసూద్కి విగ్రహం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సిద్ధిపేట జిల్లా మద్దూరు మండలం దుబ్బ తండా పరిధిలోని చెలిమితండాకు చెందిన రాజేష్ రాథోడ్ రియల్ హీరో సోనూసూద్ విగ్రాహాన్ని ఏర్పాటు చేశాడు. అంతేకాకుండా రోజు సోనూసూద్ విగ్రహానికి పూజలు చేస్తానని తెలిపాడు.
తెలంగాణలో తన విగ్రాహాన్ని నిర్మించిన విషయం సోనూసూద్కు తెలిసింది. ఈ విషయంపై ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. “నాకు ఇలా విగ్రహం ఏర్పాటు చేయడం గౌరవంగా ఉంది. కానీ దీనికి నేను అర్హుడను కాను. విగ్రహం ఏర్పాటు చేసిన చోటుకు వెళ్ళాలని ఉంది. త్వరలోనే అక్కడకు వెళ్తాను” అని రెండు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపారు సోనూసూద్.
Don’t deserve this sir.
Humbled? https://t.co/tX5zEbBwbP— sonu sood (@SonuSood) December 21, 2020